Page Loader
BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు!
కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు!

BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2024
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం వయనాడ్ బాధితులకు అవసరమైన పునరావాసం కోసం కేటాయించిన నిధులను కేరళ ప్రభుత్వం సరైన విధంగా వినియోగించలేదని బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ చెప్పారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా కేంద్రం కేరళకు తగినంత నిధులను అందించింది. కానీ పినరయి విజయన్ ప్రభుత్వం వాటిని వాడకుండా, కేంద్రాన్ని నిందించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేంద్రం నుండి SDRF కింద రూ. 500 కోట్లు, NDRF ద్వారా రూ. 700 కోట్లు కేటాయించడంతో పాటు, వయనాడ్‌లో విరిగిపోయిన కొండచరియల ప్రాంతాలకు పునరావాసం కల్పించేందుకు ప్రజల నుండి విరాళాలను కూడా సేకరించిందన్నారు. తాజాగా కేరళ హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును విమర్శించింది.

Details

ప్రజల సమస్యలను పరిష్కరించాలి

కొండచరియలు విరిగిపోయిన ప్రాంతాలకు నిధుల వినియోగం పై గణాంకాలు సరైన విధంగా అందించలేదని కోర్టు తెలిపింది. కాగా కేరళ రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె రాజన్, హైకోర్టుకు తెలిపారు. ప్రస్తుత నిబంధనల మేరకు SDRF నుండి ఖర్చు చేయడానికి కొన్ని ఆంక్షలున్నాయని, అందువల్ల కొండచరియలు విరిగిపోయిన ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించడం కష్టమైందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వానికి మరింత దృష్టి ఇవ్వాలని, ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని బీజేపీ సూచించింది.