NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kerala Blast Bomb: కేరళ బ్లాస్ట్ కేసులో బాంబుల తయారీకి కేవలం Rs. 3,000 ఖర్చు
    తదుపరి వార్తా కథనం
    Kerala Blast Bomb: కేరళ బ్లాస్ట్ కేసులో బాంబుల తయారీకి కేవలం Rs. 3,000 ఖర్చు
    Kerala Blast Bomb: కేరళ బ్లాస్ట్ కేసులో బాంబుల తయారీకి కేవలం Rs. 3,000 ఖర్చు

    Kerala Blast Bomb: కేరళ బ్లాస్ట్ కేసులో బాంబుల తయారీకి కేవలం Rs. 3,000 ఖర్చు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 31, 2023
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలో ఆదివారం జరిగిన ప్రార్థనా సమావేశంలో వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు ఇంటర్నెట్ నుంచి బాంబు తయారీ నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు.

    ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో నిపుణుడిగా చెప్పబడుతున్న డొమినిక్ మార్టిన్(48), తాను బాంబులను తయారు చేయడానికి సుమారు ₹ 3,000 ఖర్చు చేశానని చెప్పాడు.

    మార్టిన్ కుటుంబం ఐదేళ్లుగా కొచ్చి సమీపంలో అద్దెకు ఉంటున్నారు. మార్టిన్ గల్ఫ్‌లో ఫోర్‌మెన్‌గా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు.

    అక్కడ అతను ఎలక్ట్రానిక్ పరికరాన్ని కలపడం నేర్చుకున్నాడు. అతను రెండు నెలల క్రితం గల్ఫ్ నుండి తిరిగి వచ్చి పేలుళ్లకు పాల్పడ్డాడని వర్గాలు తెలిపాయి.

    బాణాసంచా తయారీలో ఉపయోగించే తక్కువ గ్రేడ్ పేలుడు పదార్ధం అయ్యిన ఐఈడిలతో తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

    Details 

     యెహోవా సాక్షుల సమావేశాన్ని ఆపాలని కోరాను: డొమినిక్ మార్టిన్

    మార్టిన్ తన ఇంటిలో IEDలను సమీకరించినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. యెహోవా సాక్షుల సమావేశంలో పాల్గొనేవారిని చంపే లక్ష్యంతో మార్టిన్ పేలుడు పదార్థాలను హాలులో ఉంచాడు.

    లొంగిపోయే ముందు, మార్టిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వీడియో సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. వీడియోలో, సంస్థ బోధనలు "విద్రోహపూరితమైనవి" కాబట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

    సమాజం, ప్రజలకు, పిల్లలకు కూడా తప్పుడు విలువలను బోధిస్తున్నదని వీడియోలో చెప్పాడు. యెహోవా సాక్షుల సమావేశాన్ని ఆపాలని తాను కోరానని, అయితే ఎవరూ తనను పట్టించుకోలేదని ఆయన అన్నారు.

    ఈ సంఘం దేశానికి చెడు చేస్తుందని తనకి అర్థమైనప్పుడు, అతను ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడని అతను పేర్కొన్నాడు.

    Details 

    వరుస పేలుళ్లలో ఇద్దరు మహిళలు, 12 ఏళ్ల బాలిక మృతి

    ఆదివారం కొచ్చి సమీపంలోని కలమసేరిలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వరుస పేలుళ్లలో ఇద్దరు మహిళలు, 12 ఏళ్ల బాలిక మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు.

    యెహోవాసాక్షుల సమావేశానికి దాదాపు 2,000 మంది హాజరయ్యారు. ప్రార్థనా సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కనీసం మూడు పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.

    ప్రార్థన మధ్యలో మొదటి పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు విలేకరులకు తెలిపారు. మొదటి పేలుడు జరిగిన వెంటనే ప్రార్ధన మందిరంలో తొక్కిసలాటకు దారితీసిందని అధికారులు తెలిపారు.

    ఈ వరుస పేలుళ్లపై ఇప్పుడు తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణ చేపట్టనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్

    కేరళ

    అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త.. శబరిమల స్పెషల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఆమోదం శబరిమల
    భారతీయ ఖగోళ శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం; చిన్న గ్రహానికి అతని పేరు  అంతరిక్షం
    ఆపరేషన్ థియేటర్లలోకి 'హిజాబ్'‌కు ప్రత్యామ్నాయ దుస్తులను అనుమతించాలి: వైద్య విద్యార్థినులు  విద్యార్థులు
    కేరళ కొత్త డీజీపీగా వైఎస్ఆర్‌ జిల్లా వాసి.. నేడు ఛార్జ్ తీసుకోనున్న దర్వేష్ సాహెబ్ కడప
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025