NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేరళ: దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న టాన్స్‌జెండర్ జంట
    భారతదేశం

    కేరళ: దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న టాన్స్‌జెండర్ జంట

    కేరళ: దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న టాన్స్‌జెండర్ జంట
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 04, 2023, 02:46 pm 1 నిమి చదవండి
    కేరళ: దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న టాన్స్‌జెండర్ జంట
    దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న టాన్స్‌జెండర్ జంట

    దేశంలోనే తొలిసారిగా కేరళకు చెందిన ఓ ట్రాన్స్ మన్ తల్లి కాబోతోంది. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న జహాద్, జియా పావల్ తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. మార్చిలో జహ్హాద్ తమ బిడ్డను ప్రసవించనున్నట్లు జియా పావల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. టాన్స్‌జెండర్ జంట తల్లిదండ్రులు కోబోతుండటం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. జియా పురుషుడిగా పుట్టి స్త్రీగా మారగా, జహాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిపోయాడు. వారిద్దరూ తాము టాన్స్‌జెండర్స్ అని తెలుసుకున్న తర్వాత తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. అనంతరం వీరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వీరు మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.

    ఇతర ట్రాన్స్‌జెండర్ల కంటే భిన్నంగా జీవించాలని అనుకున్నాం: జియా పావల్

    తల్లిదండ్రులు కాబోతున్న సందర్భంలో జియా పావల్ తమ అనూభూతిని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. తల్లి కావాలనే తన స్వప్నాన్ని, తండ్రి కావాలనే అతని కలను సాకారం చేసుకోబోతున్నట్లు పావల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. జహాద్ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి అని జియా చెప్పారు. తాను పుట్టుకతో స్త్రీని కానప్పటికీ, ఒక శిశువు తనను 'అమ్మా' అని పిలవడం వినాలని కలలు కంటున్నట్లు వెల్లడించారు. మూడేళ్ల‌క్రితం కలిసి జీవించడం ప్రారంభించినప్పుడు తమ జీవితం ఇతర ట్రాన్స్‌జెండర్ల కంటే భిన్నంగా ఉండాలని అనుకున్నట్లు జియా పేర్కొన్నారు. చాలా మంది లింగమార్పిడి జంటలను సమాజంతో పాటు వారి కుటుంబాలు బహిష్కరించాయని, తాము చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఉండాలన్న ఉద్దేశంతోనే బిడ్డకు జన్మనివ్వాలని అనుకున్నట్లు జియా చెప్పారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కేరళ
    తల్లిపాలు

    తాజా

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ

    కేరళ

    కేరళ: బీజేపీ నాయకుడి ఇంట్లో బాంబు పేలుడు భారతదేశం
    1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్ ఎయిర్ ఇండియా
    ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కేరళలో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడానికి కోసం రోబోటిక్ స్కావెంజర్‌ టెక్నాలజీ
    రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ తిరువనంతపురం

    తల్లిపాలు

    ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన బెల్జియం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023