NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కుటుంబంతో చర్చించిన తర్వాత వీఆర్ఎస్‌పై ఆలోచిస్తా: సోమేశ్‌కుమార్
    భారతదేశం

    కుటుంబంతో చర్చించిన తర్వాత వీఆర్ఎస్‌పై ఆలోచిస్తా: సోమేశ్‌కుమార్

    కుటుంబంతో చర్చించిన తర్వాత వీఆర్ఎస్‌పై ఆలోచిస్తా: సోమేశ్‌కుమార్
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 12, 2023, 12:51 pm 0 నిమి చదవండి
    కుటుంబంతో చర్చించిన తర్వాత వీఆర్ఎస్‌పై ఆలోచిస్తా: సోమేశ్‌కుమార్
    ఏపీ క్యాడర్‌కు రిపోర్టు చేసేందుకు విజయవాడకు వెళ్లిన సోమేశ్‌కుమార్

    తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్.. రిపోర్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా.. నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సోమేశ్‌కుమార్ తన వీఆర్‌ఎస్‌పై కూడా స్పందించారు. వీఆర్ఎస్‌పై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే.. ఏదైనా విషయం చెబుతానని వెల్లడించారు.

    కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను ఏపీ క్యాడర్‌కు వచ్చా: సోమేశ్‌కుమార్

    కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను ఏపీ కేడర్‌కు వచ్చినట్లు సోమేశ్‌కుమార్ వెల్లడించారు. ఒక అధికారిగా తాను డీఓపీటీ ఆదేశాలను పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తాను రిపోర్ట్ చేస్తానని చెప్పారు. తెలంగాణ సీఎస్‌గా పని చేస్తున్న సోమేష్ కుమార్‌ క్యాడర్ కేటాయింపును ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. సోమేష్‌కుమార్‌ ఏపీ క్యాడర్‌ కి వెళ్లాలని ఆదేశాలు‌ ఇచ్చింది. ఈ‌ సందర్భంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన గురువారం ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేసేందుకు విజయవాడకు వెళ్లారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ సీఎస్‌గా 1989 కేడర్‌కు చెందిన శాంతికుమారిని సీఎం కేసీఆర్ నియమించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    PHL: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌కు హ్యాండ్‌బాల్ ఆసియా ఫెడరేషన్ మద్దతు భారతదేశం
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    ట్విట్టర్ లో వరుడు హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్ అల్లు అర్జున్
    FA కప్ సెమీ-ఫైనల్స్ ఎప్పుడంటే..? ఫుట్ బాల్

    ఆంధ్రప్రదేశ్

    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం తెలంగాణ
    వివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చి‌చెప్పిన హైకోర్టు హైకోర్టు
    దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు దిల్లీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023