Page Loader
KTR : కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు
కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

KTR : కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 08, 2025
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫార్ములా ఈ రేస్‌ కేసులో హైకోర్టు తీర్పుతో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన లంచ్‌మోషన్ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు అనుమతిస్తూ, సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్‌ విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ సమయంలో లాయర్‌ను వేరే గదిలో ఉంచేందుకు హైకోర్టు సూచించింది. కానీ ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయడానికి అనుమతిని నిరాకరించింది. కోర్టు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని కోర్టుకు సమర్పించడానికి హక్కు ఇచ్చింది. ఈ తీర్పుపై సవాల్ చేస్తూ, కేటీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత, న్యాయ నిపుణులతో సలహా తీసుకొని, తన తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.