NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇన్నేళ్లు పని చేయించుకున్నారు.. ఇప్పుడెలా తొలగిస్తారంటూ కేజీబీవీ టీచర్ల ఆందోళన
    తదుపరి వార్తా కథనం
    ఇన్నేళ్లు పని చేయించుకున్నారు.. ఇప్పుడెలా తొలగిస్తారంటూ కేజీబీవీ టీచర్ల ఆందోళన
    తమను ఎలా తొలగిస్తారంటూ కేజీబీవీ టీచర్ల ఆందోళన

    ఇన్నేళ్లు పని చేయించుకున్నారు.. ఇప్పుడెలా తొలగిస్తారంటూ కేజీబీవీ టీచర్ల ఆందోళన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 23, 2023
    02:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్​ టైం పీజీటీలు, పీఆర్​టీల తొలగింపుపై దుమారం రేగుతోంది.

    తమను విధుల్లోంచి తొలగించడం ఏమిటని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు.

    నియామకం సమయంలో తమకు ఇచ్చిన హామీలేవీ ప్రభుత్వం అమలు చేయట్లేదని టీచర్లు ఆరోపించారు. సెలవుల్లోనూ తమతో పని చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో దాదాపు 840 మంది పార్ట్ టైం, గెస్ట్ టీచర్లుగా పనిచేస్తున్నారు. గత 8 ఏళ్లుగా పనిచేస్తున్న వీరందరినీ ఉన్నపళంగా ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు.

    కొత్త నియామకాల పేరుతో తమను తొలగించడాన్ని ఖండించారు. కాంట్రాక్టు పద్ధతిలో మళ్లీ తమనే తీసుకోవాలని కోరుతున్నారు.

     KGBV Part Time PGT Teachers

    కొత్త పోస్టులకు లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపణలు

    దీంతో కొత్త నియామకాల్లో తమను సర్దుబాటు చేయాలంటూ గురువారం టీచర్లు ఆందోళన చేశారు. విద్యార్హతలు, బోధనా సామర్థ్యం పరీక్షించాకే తమను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని, ఇప్పుడు ఉద్యోగాల్లోంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

    కేజీబీవీల్లో ఇంటర్ బోధన కోసం, గతంలో నియమించిన తెలుగు, ఇంగ్లీష్ టీచర్లకు, పోస్టుల సర్దుబాటు పేరుతో ప్రభుత్వం తాజాగా ఉద్వాసన పలికింది.

    కొత్తగా కాంట్రాక్టు పద్ధతి మేరకు 1,543 నియామకాలకు గత నెలలో నోటిఫికేషన్‌ సైతం జారీ అయ్యింది.

    మరో వైపు కొత్త రిక్రూట్మెంట్ పేరుతో పోస్టులను అమ్ముకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోస్టును బట్టి లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.

    జిల్లాల్లో డెమో, నైపుణ్యాల పరిశీలనకు 15 మార్కుల వెయిటేజీ ఉండటంతో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఉపాధ్యాయులు

    తాజా

    IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌! ముంబయి ఇండియన్స్
    Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు  భారతదేశం
    Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా డొనాల్డ్ ట్రంప్
    Kumki elephants: కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక.. బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్

    ఆంధ్రప్రదేశ్

    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్ సీబీఐ
    తిరుపతి హథీరాంజీ మఠంలో అర్జున్ దాస్ తొలగింపు, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం ప్రభుత్వం
    ప్రభుత్వంతో పట్టుబట్టి 37 డిమాండ్లు ఒడిసిపట్టాం.. ఉద్యమం విరమిస్తున్నాం  ఉద్యోగులు

    ఉపాధ్యాయులు

    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్ తూర్పుగోదావరి జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025