NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Killers Of Pahalgam: పహల్గాంలో ఉగ్ర దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల చేసిన ఏజెన్సీలు..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Killers Of Pahalgam: పహల్గాంలో ఉగ్ర దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల చేసిన ఏజెన్సీలు..!
    పహల్గాంలో ఉగ్ర దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల చేసిన ఏజెన్సీలు..!

    Killers Of Pahalgam: పహల్గాంలో ఉగ్ర దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల చేసిన ఏజెన్సీలు..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 23, 2025
    01:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు తీవ్రవాదుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు బుధవారం విడుదల చేశాయి.

    అధికారుల ప్రకారం,వారిలో ముగ్గురి పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు.

    వీరికి మూసా, యూనిస్‌, ఆసీఫ్ అనే కోడ్ నేమ్‌లు ఉన్నట్లు పీటీఐ నివేదించింది.

    ఈ ముగ్గురు 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' (TRF) అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారని గుర్తించారు. ఈ సంస్థ జమ్మూకశ్మీర్‌ కేంద్రంగా పని చేస్తోంది.

    వివరాలు 

    ఉగ్రవాదుల కోసం భారీ స్థాయిలో గాలింపు చర్యలు

    ఈ చిత్రాలను ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న ప్రత్యక్ష సాక్షుల వర్ణనల ఆధారంగా రూపొందించారు.

    దాడి సమయంలో ఉగ్రవాదులు పురుషులను ప్రత్యేకంగా వేరు చేసి వారి గుర్తింపులను తనిఖీ చేస్తున్న సమయంలో, బాధితులు వారి ముఖాలను గమనించినట్లు తెలిసింది.

    ఈ కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

    అదే విధంగా, ఓ ఉగ్రవాది ఆటోమేటిక్ ఆయుధంతో ఉన్న ఫొటోను కూడా భద్రతా సంస్థలు విడుదల చేసింది.

    వివరాలు 

    బైసరన్‌ లోయను లక్ష్యంగా ఎంచుకున్న ఉగ్రవాదులు 

    పర్యాటకులపై దాడికి బైసరన్‌ లోయను ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

    ఎక్కువమంది పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని,మరణాల సంఖ్యను పెంచేందుకు వీరు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారని భావిస్తున్నారు.

    బైసరన్‌ లోయ ప్రాంతంలో భద్రతా చర్యలు తక్కువగా ఉండడాన్ని వారు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.

    పహల్గాం నుంచి ఈలోయకు చేరాలంటే సుమారు 6.5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది.

    ఇది సాధ్యపడేది కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే దీనివల్ల భద్రతా బలగాల రాక ఆలస్యం అవుతుంది,సహాయక చర్యలు కూడా ఆలస్యమవుతాయి.

    ఈ ప్రాంతం చుట్టూ గాఢమైన అటవీ ప్రాంతం ఉండటంతో,అలాగే మంచు కురుస్తుండడంతో ఉగ్రవాదులు ఈ ప్రాంతం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.

    అలాంటి పరిస్థితుల్లో సైన్యం గాలింపు చర్యలు చేపట్టినా,ముష్కరులను వెంటనే గుర్తించడం కష్టం అవుతుంది.

    వివరాలు 

    దాడిని బాడీ కెమెరాల్లో చిత్రీకరించిన ఉగ్రవాదులు 

    ఈ దాడి మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ప్రారంభమైంది.

    ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన సమాచారం ప్రకారం, ముష్కరులు దాడిని బాడీ కెమెరాల సహాయంతో వీడియో రికార్డు చేశారు.

    ఈ కెమెరాలను హెల్మెట్లకు అమర్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

    ఉగ్రవాదులు ముందుగా బాధితులందరినీ ఒకచోటకు చేర్చారు. ఆపై వారి గుర్తింపులను సేకరించడంతోపాటు వారిపై దాడి చేశారు.

    కొంతమందిని దగ్గరగా కాల్చగా, మరికొంతమందిపై దూరం నుంచి స్నైపర్ లాంటి ఆధునిక టెక్నిక్స్‌ను ఉపయోగించి కాల్పులు జరిపారు.

    ఈ దాడి మానవతావాదాన్ని మంటగలిపే దారుణ ఘటనగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    జమ్ముకశ్మీర్

    Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దులో ల్యాండ్ మైన్ పేలుడు.. ఆరుగురు జవాన్లకు గాయాలు ఆర్మీ
    Mysterious deaths: రాజౌరీ జిల్లాలో అనుమానాస్పద రీతిలో మరణాలు.. విచారణకు సిట్ ఏర్పాటు  భారతదేశం
    Amit Shah : జమ్ముకశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి అమిత్‌ షా కీలక అదేశాలు అమిత్ షా
    Rajouri: చిక్కుముడి వీడిన అంతుచిక్కని వ్యాధి.. క్వారంటైన్‌లో గ్రామం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025