NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NEET UG Leak : పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌.. 13మంది నిందితులపై అభియోగాలు 
    తదుపరి వార్తా కథనం
    NEET UG Leak : పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌.. 13మంది నిందితులపై అభియోగాలు 
    పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌.. 13మంది నిందితులపై అభియోగాలు

    NEET UG Leak : పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌.. 13మంది నిందితులపై అభియోగాలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 02, 2024
    11:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 అంశం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది.

    దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో ఇప్పటికీ విచారణ సాగుతోంది.

    నీట్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు.

    ఇక నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌పై సీబీఐ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

    ఇందులో నలుగురు అభ్యర్థులు, ఓ జూనియర్ ఇంజినీర్, ఇద్దరు కుట్రదారులు సహా 13 మందిని నిందితులుగా తేల్చింది.

    Details

    నీట్ పరీక్షా 

    ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టును పలువురు కోరగా, అందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

    నీట్ లీక్ అయిందని, అయితే దాని ప్రభావమే స్వల్పమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

    బిహార్‌కు చెందిన నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్‌లతో పాటు విద్యార్థులు ఆయుష్ కుమార్, అనురాగ్ యాదవ్, అభిషేక్ కుమార్, శివేంద్ర కుమార్‌, దనాపూర్‌కు చెందిన జూనియర్ ఇంజినీర్ సికిందర్ యాదవేందులు పేర్లు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.

    మొత్తం 13 మంది నిందితులపై నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    Details

    ప్రధాన నిందితుడిగా నితీష్ కుమార్

    పాట్నాలోని గోపాల్‌పూర్ కు చెందిన నితీష్ కుమార్ ని ప్రధాన నిందితుడిగా పేర్కొంది.

    అమిత్ ఆనంద్, యాద్వెందుతో కలిసి ఒక్కో విద్యార్థికి రూ. 30-32 లక్షల చొప్పున అమ్మినట్లు తెలిసింది.

    నీట్ పరీక్షకు ముందు రోజు మే4న రాత్రి నలుగురు విద్యార్థులను అమిత్ పిలిపించి, లీకైన ప్రశ్నపత్రం సాల్వ్ చేసి సమాధానాలను గుర్తుపెట్టుకొనేలా వారిని బట్టిపట్టించారు.

    ఈ ఘటనపై 58 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఇప్పటి వరకూ 40 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నీట్ స్కామ్ 2024
    సీబీఐ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    నీట్ స్కామ్ 2024

    NEET-UG 2024: జూలై 8 లోగా సమాధానం ఇవ్వండి.. NTA,కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు  సుప్రీంకోర్టు
    NEET row: మోడీ మౌనం వీడండన్న రాహుల్ గాంధీ  భారతదేశం
    Neet: 'చిరిగిన OMR షీట్'కు సంబంధించి నీట్ అభ్యర్థి పిటిషన్ తిరస్కరణ.. విద్యార్థిపై చర్య తీసుకునే అవకాశం  భారతదేశం
    NEET-UG: లీకైన NEET-UG పేపర్ పరీక్ష పేపర్‌తో సరిపోలింది: అభ్యర్థి  భారతదేశం

    సీబీఐ

    సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం  కర్ణాటక
    మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం వైఎస్సార్ కడప
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! కర్నూలు
    సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు; ముందస్తు బెయిల్ తిరస్కరణ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025