Page Loader
న్యాయ శాఖను కోల్పోవడంపై కిరెణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ 
న్యాయ శాఖను కోల్పోవడంపై కిరెణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్

న్యాయ శాఖను కోల్పోవడంపై కిరెణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
May 19, 2023
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎర్త్ సైన్సెస్ మంత్రిగా కిరెణ్ రిజిజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి కొత్త శాఖకు మారడం శిక్ష కాదని, ప్రభుత్వ ప్రణాళికలో భాగమన్నారు. న్యాయ మంత్రి పదవి నుంచి గురువారం తొలగించబడిన రిజిజు, ఆ విషయం గురించి మాట్లాడటానికి నిరాకరించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు తనను తప్పకుండా విమర్శిస్తాయని చెప్పారు. అయితే ఇది నాకు కొత్త విషయం కాదన్నారు. ఒక ప్రణాళిక, దార్శనికతతో ప్రధాని మోదీ తన శాఖను మార్చినట్లు చెప్పుకొచ్చారు. రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్ కొత్త న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కిరెణ్

కొలీజియం నియామకాల విధానంపై రిజిజు అసహనం

న్యాయశాఖ మంత్రిగా రిజిజు పదే పదే న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ, కొలీజియం నియామకాల విధానాన్ని విమర్శించారు. అతని ప్రకటనలు న్యాయమూర్తుల నియామకంపై న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం మధ్య తరచూ వాదోపవాదాలు జరిగేవి. దేశంలో న్యాయవ్యవస్థ వర్సెస్ ప్రభుత్వ పోరు లేదని రిజిజు స్వయంగా స్పష్టం చేసినప్పటికీ, ఆయన ప్రకటనలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. 2021లో లోక్‌సభను ఉద్దేశించి కిరెన్ రిజిజు మాట్లాడుతూ, ఉన్నత న్యాయవ్యవస్థ నియామకాల కోసం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం గుడ్డిగా అంగీకరించదని అన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కొలీజియం వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం గురించి ఆయన మాట్లాడారు.