Page Loader
Kishan Reddy: దేశంలో బొగ్గు ద్వారానే 72% విద్యుదుత్పత్తి: కిషన్‌రెడ్డి
దేశంలో బొగ్గు ద్వారానే 72% విద్యుదుత్పత్తి: కిషన్‌రెడ్డి

Kishan Reddy: దేశంలో బొగ్గు ద్వారానే 72% విద్యుదుత్పత్తి: కిషన్‌రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో విద్యుదుత్పత్తి 72% బొగ్గుతోనే జరుగుతోందని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటం, పారిశ్రామికీకరణ వేగంగా జరిగి, విద్యుదుత్పత్తి పెరిగిపోతున్నాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఒడిశాలోని కోణార్క్‌లో జరుగుతున్న రాష్ట్రాల బొగ్గు, గనులశాఖ మంత్రుల మూడో జాతీయ సదస్సులో సోమవారం కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...

వివరాలు 

మార్చి నుంచి నైనీ బ్లాక్ ద్వారా బొగ్గు ఉత్పత్తి

"దేశ జీడీపీలో బొగ్గు, గనుల రంగం 2 శాతాన్ని కాపాడుతోంది. బొగ్గు ఉత్పత్తి విలువ సుమారు రూ. 1.86 లక్షల కోట్లు అని అంచనా. 2024లో 997 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని చెప్పవచ్చు. 2014తో పోలిస్తే ఉత్పత్తి 76% పెరిగింది. 2030 నాటికి 1.5 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా తీసుకున్నాం" అని కిషన్‌రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో సున్నపురాయి,ఇనుప ఖనిజం, మాంగనీసు, క్వార్ట్జ్, గ్రానైట్,మెటల్,డోలమైట్‌ వంటి ఖనిజాల సంపద పుష్కలంగా ఉందని చెప్పారు. "ఈ రెండేళ్లలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని"ఆయన తెలిపారు."మార్చి నుంచి నైనీ బ్లాక్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తాం"అని భట్టి చెప్పారు.

వివరాలు 

కిషన్‌రెడ్డికి డిప్యూటీ సీఎం విజ్ఞప్తి 

తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులపై భట్టి విక్రమార్క కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేయడానికి ఒక లేఖను అందించారు. ఆరెర్‌ఆర్‌ఆర్, రేడియల్ రోడ్లు, మెట్రోరైల్ ఫేజ్-2, మూసీనది పునరుజ్జీవనం, గోదావరి-మూసీ నదుల అనుసంధానం, హైదరాబాద్ నగర సీవరేజ్ మాస్టర్ ప్లాన్, వరంగల్ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, బందరు పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు డ్రై పోర్ట్, సింగరేణికి బొగ్గు బ్లాక్ కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్ తదితర అంశాలపై రాష్ట్రానికి సహాయం అందించాలనే అభ్యర్థనను కేంద్రమంత్రికి లేఖ ద్వారా తెలియజేశారు.