NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kolkata case:విధుల్లో చేరేందుకు నిరాకరించిన కోల్‌కతా వైద్యులు.. సీఎంతో మరోసారి చర్చలు కావాలి
    తదుపరి వార్తా కథనం
    Kolkata case:విధుల్లో చేరేందుకు నిరాకరించిన కోల్‌కతా వైద్యులు.. సీఎంతో మరోసారి చర్చలు కావాలి
    విధుల్లో చేరేందుకు నిరాకరించిన కోల్‌కతా వైద్యులు.

    Kolkata case:విధుల్లో చేరేందుకు నిరాకరించిన కోల్‌కతా వైద్యులు.. సీఎంతో మరోసారి చర్చలు కావాలి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 18, 2024
    11:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

    పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపిన వైద్యులు తమ నిరసనలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.

    మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు సీఎంతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

    బాధితురాలికి పూర్తిగా న్యాయం జరిగేంతవరకు తమ నిరసనలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

    ఆరోగ్య కార్యదర్శిని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఉదయం నుంచి రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనలు కొనసాగిస్తున్నాయి. '

    వివరాలు 

    ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యులకు భద్రత

    'మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేంతవరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. కోల్‌కతా ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎన్‌ఎస్‌ నిగమ్‌ను విధుల నుంచి తొలగించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి. ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం అత్యవసరం. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు సీఎంతో మరోసారి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది'' అని వైద్యులు తెలిపారు.

    సీఎం మమతాతో మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ చీఫ్‌ సెక్రటరీ మనోజ్‌ పంత్‌కు మెయిల్‌ పంపినట్లు వారు వెల్లడించారు.

    ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యులకు భద్రత కల్పించడమే కాకుండా, ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లను ఎలా ఖర్చు చేయాలనే అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

    వివరాలు 

    కోల్‌కతా నగర పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌పై వేటు

    జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటన రాజకీయ విమర్శలను తెరపైకి తెచ్చింది.

    ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వైద్యులతో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

    వైద్య విద్యార్థుల ఐదు డిమాండ్లలో మూడు డిమాండ్లను దీదీ అంగీకరించింది. ఆందోళనకారుల డిమాండ్‌ మేరకు కోల్‌కతా నగర పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌పై వేటు పడింది.

    ఈ క్రమంలో, నూతన కమిషనర్‌గా మనోజ్‌ కుమార్‌ వర్మను నియమిస్తూ దీదీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

    మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు మరోసారి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని నిరసనకారులు అభ్యర్థిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    కోల్‌కతా

    IND vs SA: టీమిండియా 8వ విక్టరీ.. 83 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్ టీమిండియా
    Kolkata: పిల్లిని కాపాడే ప్రయత్నంలో 8వ అంతస్తు నుంచి పడి మహిళ మృతి  మహిళ
    Safest city: భారత్‌లో అత్యంత సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే?  హైదరాబాద్
    Suicide at Eden: ఈడెన్ గార్డెన్స్‌ లో దారుణం..గాలరీలో వేలాడుతూ విగ‌త‌జీవిగా క‌నిపించిన యువ‌కుడు ఈడెన్ గార్డన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025