NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Rains: కోనసీమ జిల్లాలో గోదారి ఉధృతి.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్
    తదుపరి వార్తా కథనం
    AP Rains: కోనసీమ జిల్లాలో గోదారి ఉధృతి.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్
    40 గ్రామాలకు రాకపోకలు బంద్

    AP Rains: కోనసీమ జిల్లాలో గోదారి ఉధృతి.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 13, 2024
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.

    జిల్లాలో వైనతేయ, వశిష్ఠ, గౌతమి, వృద్ధ గౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రభావంతో కనకాయలంక, ముక్తేశ్వరం, అప్పనపల్లి కాజ్‌వే మునిగిపోయాయి.

    పడవలపై లంక గ్రామాల ప్రజలు ప్రయాణిస్తున్నారు. ఏనుగుపల్లి, తొగరపాయ వద్ద పడవల ద్వారా లంక గ్రామాల ప్రజలు బయటకు వస్తున్నారు.

    కోనసీమకు రెండోసారి వరదలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా పర్యటించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వరదలపై అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు.

    వివరాలు 

    చాకలిపాలెం - కనకాయలంక కాజ్వే పై వరద ఉధృతి

    మరోవైపు, జిల్లాలోని రాజోలు దీవిలో గంటకు గంట వరద ఉధృతి పెరుగుతోంది. పాశర్లపూడి - అప్పనపల్లి కాజ్వే పై వరద నీరు చేరటంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు.

    చాకలిపాలెం - కనకాయలంక కాజ్వే పై వరద ఉధృతి పెరగడంతో లంకవాసులు పడవలపై ప్రయాణిస్తున్నారు.

    టేకు శెట్టిపాలెం - అప్పనరాముని లంక కాజ్వే మునిగిపోవడంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు ఆర్డీవో.

    వివరాలు 

    వరద ప్రభావిత ప్రాంతాల్లో.. అమలాపురం ఎంపి,ఎమ్యెల్యే  

    ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అమలాపురం ఎంపి గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వరద ముంపుకు గురైన ఇళ్ళు, పంటపొలాలను పరిశీలించారు.

    ముంపు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

    వరదలతో నదీ కోతకు గురైన లంక గ్రామాల పరిరక్షణకు ఇప్పటికే 252 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని చెప్పారు.

    డిజాస్టర్ మేనేజ్ మెంట్ నుండి పెద్ద ఎత్తున నిధులు సేకరించి లంక గ్రామాలను పరిరక్షిస్తామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోనసీమ

    తాజా

    Tatkal Tkt Booking: జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు: మోసాల నివారణకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం  రైల్వే శాఖ మంత్రి
    Gold Rate: మళ్లీ రూ.లక్ష మార్క్‌ దాటిన బంగారం ధర  బంగారం
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100 స్టాక్ మార్కెట్
    USA: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత.. మిడిల్ ఈస్ట్ లో ఉన్న సిబ్బంది వెనక్కు రప్పిస్తున్న అమెరికా డొనాల్డ్ ట్రంప్

    కోనసీమ

    సైకో ఘాతుకం; స్నాప్‌చాట్‌లో ప్రేమించిన మహిళ అనుకొని మరో యువతి హత్య ఆంధ్రప్రదేశ్
    ఆత్రేయపురంలో బంగారం పూతరేకులు; ధరంతో తెలుసా? ఆంధ్రప్రదేశ్
    కోనసీమ: బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్, మంటలు    ఆంధ్రప్రదేశ్
    #Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో దళిత బాలికకు ఘోర అవమానం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025