NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jaahnavi Kandula Case: జాహ్నవి కందులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ 
    తదుపరి వార్తా కథనం
    Jaahnavi Kandula Case: జాహ్నవి కందులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ 
    Jaahnavi Kandula Case: జాహ్నవి కందులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్

    Jaahnavi Kandula Case: జాహ్నవి కందులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 22, 2024
    06:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కొట్టి చంపిన అమెరికా పోలీసు ఆఫీసర్ కెవిన్ డేవ్ పై ఎలాంటి నేరాభియోగాలు మోపడం లేదని ప్రకటించింది.

    సీనియర్ అటార్నీలతో విచారణ జరిపిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారికి శిక్ష పడే అవకాశాలు లేవు.

    ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ నిర్ణయంపై మాజీమంత్రి,బీఆర్ఎస్ నేత కేటిఆర్ స్పందించారు.

    అమెరికా పోలీసు ఆఫీసర్ కెవిన్ డేవ్ పై క్రిమినల్ కేసులు పెట్టకపోవడం అవమానకరమని,పూర్తిగా ఆమోదయోగ్యం కాదని గురువారం ఆవేదన వ్యక్తం చేశారు.

    భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ అధికారులతో సంప్రదించి జాహ్నవి కందుల కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

    Details 

    పోలీస్ కారు ఢీకొని జాహ్నవి కందుల మృతి 

    విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెంటనే జోక్యం చేసుకోని, ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా చూడాలని కోరారు.

    జాహ్నవి కందులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేయడం ఇదే తొలిసారి కాదు.

    గతంలో, జాహ్నవి కుటుంబానికి న్యాయం చేయాలని భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లను ఆయన కోరారు.

    అమెరికా పోలీసు అధికారులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆందోళనను, విచారాన్ని వ్యక్తం చేశారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల (23) అనే విద్యార్థిని జనవరి 25, 2023న సియాటిల్ పోలీస్ కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదంలో మరణించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేటిఆర్ చేసిన ట్వీట్ 

    Disgraceful & absolutely unacceptable !

    I demand the @USAmbIndia to take up the matter with US Government authorities and deliver justice to the family of young Jaahnavi Kandula

    I request EA Minister @DrSJaishankar Ji to take up the matter with his counterpart & demand a… https://t.co/90pw59LtCo

    — KTR (@KTRBRS) February 22, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ ప్రియాంక గాంధీ
    రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయం : కేటీఆర్ తెలంగాణ
    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025