NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Lalu Prasad Yadav: పెద్ద కుమారుడిపై లాలూ కఠిన నిర్ణయం.. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కీలక ప్రకటన!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Lalu Prasad Yadav: పెద్ద కుమారుడిపై లాలూ కఠిన నిర్ణయం.. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కీలక ప్రకటన!
    పెద్ద కుమారుడిపై లాలూ కఠిన నిర్ణయం.. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కీలక ప్రకటన!

    Lalu Prasad Yadav: పెద్ద కుమారుడిపై లాలూ కఠిన నిర్ణయం.. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కీలక ప్రకటన!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 25, 2025
    04:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు.

    ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. తేజ్ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు.

    Details

    వివాదాస్పద ఫేస్‌బుక్ పోస్టు కారణం

    ఈ నిర్ణయానికి కారణం శనివారం తేజ్ ప్రతాప్ ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన ఓ వివాదాస్పద పోస్టు. ఆ ఫొటోలో తేజ్ ప్రతాప్ ఓ యువతితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు కనిపించాయి.

    ఆ యువతి పేరు అనుష్క యాదవ్ అని, తాము గత 12 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామంటూ ఆ పోస్టులో పేర్కొనడంతో తీవ్ర దుమారం చెలరేగింది.

    ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున స్పందనలు రావడంతో తేజ్ ప్రతాప్ ఆ పోస్టును కొద్దిసేపటికే తొలగించారు.

    అప్పటికే అంశం తీవ్ర దృష్టికి చేరిపోయింది. తర్వాత తేజ్ ప్రతాప్ స్పందిస్తూ తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని, ఆ పోస్టు తాను చేయలేదని వివరణ ఇచ్చారు.

    అయినా లాలూ ప్రసాద్ యాదవ్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు.

    Details

     లాలూ కఠిన వ్యాఖ్యలు

    వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, సామాజిక న్యాయం కోసం మన సమిష్టి పోరాటాన్ని బలహీన పరుస్తుంది.

    తేజ్ ప్రతాప్ ప్రవర్తన మన కుటుంబ సంప్రదాయాలకు విరుద్ధమైంది. అందువల్ల, పార్టీతో పాటు కుటుంబం నుంచి కూడా ఆరేళ్ల పాటు అతన్ని బహిష్కరిస్తున్నాను.

    ఈ రోజు నుంచి అతనికి పార్టీతో ఎలాంటి సంబంధం ఉండదని లాలూ పేర్కొన్నారు.

    Details

    గత వివాహ వివాదం

    తేజ్ ప్రతాప్ యాదవ్ 2018లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు.

    అయితే కొన్ని నెలల తర్వాతే వారి మధ్య విభేదాలు తలెత్తి, ఆమె కుటుంబాన్ని విడిచిపెట్టినట్లు అప్పట్లో వార్తలు వెలుగుచూశాయి.

    ఈ నేపథ్యంలో తాజాగా తేజ్ ప్రతాప్ చేసిన వ్యక్తిగత జీవనపరిణామాలు, ఆర్జేడీ పార్టీపై, యాదవ్ కుటుంబ ప్రతిష్టపై ప్రభావం చూపిస్తున్నాయనే కారణంతో లాలూ ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లాలూ ప్రసాద్ యాదవ్

    తాజా

    Lalu Prasad Yadav: పెద్ద కుమారుడిపై లాలూ కఠిన నిర్ణయం.. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కీలక ప్రకటన! లాలూ ప్రసాద్ యాదవ్
    Ukraine crisis: రష్యా భీకర దాడి.. ఉక్రెయిన్‌పై 367 డ్రోన్లు, క్షిపణులతో భారీ విధ్వంసం ఉక్రెయిన్
    Hazardous cargo: కేరళ తీరంలో లైబీరియా నౌక మునిగింది.. హై అలర్ట్‌ ప్రకటించిన అధికారులు లైబీరియా
    #NewsBytesExplainer: మైసూర్ శాండల్ సోప్ యజమాని ఎవరు..? ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ సంస్థదా..? భారతదేశం

    లాలూ ప్రసాద్ యాదవ్

    జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సీబీఐ
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం సీబీఐ
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు తేజస్వీ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025