NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Land Registrations: భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి.. కృష్ణా జిల్లాలో ఎంతంటే?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Land Registrations: భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి.. కృష్ణా జిల్లాలో ఎంతంటే?
    భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి.. కృష్ణా జిల్లాలో 10 శాతం పెంపు

    Land Registrations: భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి.. కృష్ణా జిల్లాలో ఎంతంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 29, 2025
    11:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రతిపాదిత ప్రాంతాల్లో ధరలు పెరగాలని అంచనా వేసినా, పెద్దగా మార్పులు జరగలేదు.

    విజయవాడతో పోలిస్తే ధరలు తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం విజయవాడ గ్రామీణంలో 20-30 శాతం పెంచగా, ప్రస్తుతం 5 శాతమే పెరిగింది.

    ధరల పెంపుపై తుది జాబితా సిద్ధం చేసి, అది వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా పెంచిన భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

    గత వైసీపీ ప్రభుత్వంలో భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు అస్తవ్యస్తంగా ఉండగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా స్వల్పంగా పెంచింది.

    Details

    విజయవాడలో 8 శాతం పెరిగింది

    విజయవాడలో గరిష్ఠంగా 8 శాతం పెరిగింది, కృష్ణా జిల్లాలో 10 శాతం పెంచారు. ఫిబ్రవరి 1 నుంచి భారీ ధరలు పెరిగిపోతాయనే ప్రచారంతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కిటకిలాడిపోయాయి.

    గాంధీనగర్, గుణదల, పటమట, నున్న, ఇబ్రహీంపట్నం కార్యాలయాల్లో నిత్యం 100-150 రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ సోమ, మంగళవారాల్లో 2,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి.

    గతంలో 3 నెలల ఒప్పందాలు చేసిన వారు వాటిని రద్దు చేసుకుని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.

    విజయవాడ నగర పరిధిలోని ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో 4-8 శాతం, విజయవాడ పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లో 5 శాతం, ఆటోనగర్, బెంజిసర్కిల్‌ వరకు 7 శాతం పెంచారు.

    Details

     ఎకరం ధర రూ.7 కోట్లు

    కానూరు, పెనమలూరు, కంకిపాడు వరకు 5-10 శాతం పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి.

    నున్న, జక్కంపూడి, పి.నైనవరం ప్రాంతాల్లో ఎకరం ధర రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉండగా, ఇక్కడ 10-15 శాతం పెరుగుతుందని భావించినా, 5 శాతానికే పరిమితమైంది.

    గుడివాడ, కంకిపాడు ప్రాంతాల్లో 10 శాతం వరకు పెంచారు. మైలవరం, కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో 5 శాతం పెరగనున్నాయి.

    తాడిగడప, కొండపల్లి వంటి మున్సిపాలిటీల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో 10 శాతం పెరిగింది. నగర పంచాయతీ పరిధిలో మాత్రం 5 శాతం మాత్రమే పెరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కృష్ణా జిల్లా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    కృష్ణా జిల్లా

    Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి  రోడ్డు ప్రమాదం
    Andhra Pradesh: గుడ్లవల్లేరులో దారుణం.. లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా!  భారతదేశం
    Vijayawada: భయం గుప్పిట్లో విజయవాడ.. మళ్లీ పెరిగిన వరద ప్రవాహం  విజయవాడ వెస్ట్
    Tsunami: అలల కాటుతో తెగిపోయిన జీవితాలు.. విధ్వంసానికి 20 ఏళ్లు పూర్తి మచిలీపట్నం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025