Jammu and Kashmir: జమ్ముకశ్మీర్లోని వైద్యుడిని, వలస కార్మికులను చంపిది మేమే.. TRF ప్రకటన
జమ్ముకశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో ఆదివారం జరిగిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులు చనిపోయిన ఘటనకు పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించినట్లు ప్రకటించాయి. TRF చీఫ్ షేక్ సజ్జాద్ గుల్ ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్నారని, ఆయన ఆదేశాల ప్రకారం, కశ్మీరీలు, కాశ్మీరీయేతరులను మొదటిసారిగా లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందన్నారు. గత ఒకటిన్నర ఏడాదిలో TRF కాశ్మీరీ పండిట్లు, సిక్కులు, స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుంటోంది. దాడికి ముందు, ఈ ఉగ్రవాద బృందం గందర్బల్ జిల్లా సోనామార్గ్ ప్రాంతంలోని నిర్మాణ ప్రదేశాన్ని గత నెల రోజులుగా పరిశీలించిందని వర్గాలు తెలిపారు
దాడిని ఖండించిన జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి
ప్రాథమిక నివేదికల ప్రకారం, దాడికి గురైన వైద్యుడు, కార్మికులు Z-Morh సొరంగం నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఇది గగనీర్ను సోనామార్గ్కు కలిపే ప్రాజెక్టు. కార్మికులు, ఇతర ఉద్యోగులు గండర్బల్లోని తమ శిబిరానికి తిరిగి వస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడిని జరిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా, ఒక బీహార్ వలస కార్మికుడిని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. నిరాయుధ అమాయక ప్రజలపై ఈ దాడిని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు.