NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra: త్వరలో మహారాష్ట్రలో 'లవ్ జిహాద్'కు వ్యతిరేకంగా చట్టం? ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు 
    తదుపరి వార్తా కథనం
    Maharashtra: త్వరలో మహారాష్ట్రలో 'లవ్ జిహాద్'కు వ్యతిరేకంగా చట్టం? ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు 
    త్వరలో మహారాష్ట్రలో 'లవ్ జిహాద్'కు వ్యతిరేకంగా చట్టం? ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు

    Maharashtra: త్వరలో మహారాష్ట్రలో 'లవ్ జిహాద్'కు వ్యతిరేకంగా చట్టం? ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 15, 2025
    04:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది.

    ఈ చట్టంలోని ముఖ్య అంశాలను పరిశీలించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

    ఈ కమిటీలో స్త్రీ, శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, చట్ట, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం శాఖల కార్యదర్శులు, హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు.

    ప్రభుత్వ తీర్మానం ప్రకారం,ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తుంది.

    'లవ్ జిహాద్' , బలవంతపు మత మార్పిడులపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది.

    వివరాలు 

    గత ఏడాది 'లవ్ జిహాద్' అంశాన్ని ప్రస్తావించిన పాలక మహాయుతి

    అదనంగా, ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టాలను పరిశీలించి, ఈ తరహా సంఘటనలను నివారించేందుకు ఏ విధమైన చట్టాలు రూపొందించాలి అనే దానిపై సూచనలు అందిస్తుంది.

    పాలక మహాయుతి గత ఏడాది 'లవ్ జిహాద్' అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే.

    ఈ సందర్భంగా మహారాష్ట్ర మంత్రి మంగళ్ లోధా మాట్లాడుతూ, "దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ సంఘటనలు పెరుగుతున్నాయి. శ్రద్ధా వాకర్ ఘటన ఎలా జరిగిందో మనమందరం చూశాం. మహారాష్ట్రలో ఇలాంటి అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. లవ్ జిహాద్‌ను అడ్డుకునే చర్యలు తీసుకుంటున్నాం. అమ్మాయిలకు న్యాయం జరిగేలా చూడాలి. ఈ కమిటీ ఏర్పాటవ్వడం సానుకూల పరిణామం. త్వరలో నివేదిక సిద్ధమవుతుంది, దీనిపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది," అని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    మహారాష్ట్ర

    Maharastra: మహారాష్ట్ర క్యాబినెట్‌లో సగం బెర్త్‌లు బీజీపీ తీసుకునే అవకాశం.. షిండే వర్గానికి మూడు కీలక మంత్రి పదవులు  భారతదేశం
    Maharashtra: అమిత్ షాతో మహాయుతి నేతలు భేటీ; త్వరలో సీఎం ప్రకటన భారతదేశం
    Maharastra: మహారాష్ట్రలో బస్సు బోల్తా.. 10 మంది మృతి, పలువురికి గాయలు  రోడ్డు ప్రమాదం
    Maharashtra: మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025