NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / యూసీసీపై గడువు పెంచేది లేదు.. తేల్చేసిన లా కమిషన్
    తదుపరి వార్తా కథనం
    యూసీసీపై గడువు పెంచేది లేదు.. తేల్చేసిన లా కమిషన్
    యూసీసీపై గడువు పెంచేది లేదు.. తేల్చేసిన లా కమిషన్

    యూసీసీపై గడువు పెంచేది లేదు.. తేల్చేసిన లా కమిషన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 28, 2023
    06:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటైన 22వ లా కమిషన్ కు ఇప్పటికే 75 లక్షలకు పైగా స్పందనలు అందాయి.

    ఈ విషయాన్ని ఇప్పటికే లా కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

    అదేవిధంగా యూసీసీపై అభిప్రాయాలను తెలియజేసేందుకు ఇచ్చిన గడువును పెంచేది లేదని లా కమిషన్ స్పష్టం చేసింది.

    75 లక్షల స్పందనలలో 2 లక్షలకు పైగా అభిప్రాయాలను ప్రధానమంత్రికి పంపినట్లు చెప్పింది.

    యూసీసీకి వచ్చిన స్పందనపై నిర్ణయాల గురించి జూలై 28వ తేదీ నుంచి విశ్లేషించనున్నారు.

    ముఖ్యంగా ఎంపిక చేసిన పార్టీలతో ముఖాముఖీ చర్యలను కూడా ప్యానల్ జరిపే అవకాశం ఉంది.

    Details

    ఒకే ఇంట్లో రెండు చట్టాలుంటే పురోగతి ఎలా సాధ్యమన్న ప్రధాని

    ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యూసీసీ అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఒకే ఇంట్లో రెండు చట్టాల ఉంటే పురోగతి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

    ఈ నేపథ్యంలో యూసీసీపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

    పెళ్లి, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడాన్ని యూసీసీ అంటారు.

    గతంలోనూ కేంద్రంలోని ప్రభుత్వాలు ఉమ్మడి పౌరస్మృతిపై చర్చలు జరిపినా అది కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రధాన మంత్రి
    ఇండియా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ప్రధాన మంత్రి

    భారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే  అమెరికా
    అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే నరేంద్ర మోదీ
    ఫ్రెంచ్ అధికారిణి చేతిలో గొడుగు లాక్కున్న పాక్ ప్రధాని.. షెహబాజ్ షరీఫ్ పై నెటిజన్ల ఫైర్ పాకిస్థాన్
    నేడు బోయింగ్, అమెజాన్, గూగుల్ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం నరేంద్ర మోదీ

    ఇండియా

    INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే  ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్
    Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్ నెట్ ఫ్లిక్స్
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025