NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన.. కేసు వాదిస్తు కుప్పకూలిన న్యాయవాది 
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన.. కేసు వాదిస్తు కుప్పకూలిన న్యాయవాది 
    తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన.. కేసు వాదిస్తు కుప్పకూలిన న్యాయవాది

    Telangana: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన.. కేసు వాదిస్తు కుప్పకూలిన న్యాయవాది 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 18, 2025
    04:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ హైకోర్టులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోర్టు హాలులో ఓ న్యాయవాది కుప్పకూలిన సంఘటన తోటి న్యాయవాదులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

    వివరాల్లోకి వెళితే... న్యాయవాది వేణుగోపాలరావు 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించిన వాదనలు వినిపిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలారు.

    గమనించిన తోటి న్యాయవాదులు వెంటనే స్పందించి, ఆయనను అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

    అయితే అప్పటికే గుండెపోటు కారణంగా వేణుగోపాలరావు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

    ఈ విషాద ఘటనతో 21వ కోర్టులో న్యాయమూర్తి సంతాప సూచకంగా పిటిషన్ల విచారణను నిలిపివేశారు.

    అలాగే, మిగతా కోర్టుల్లో అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్‌ పిటిషన్లను మాత్రమే విచారించి, రెగ్యులర్‌ పిటిషన్లను వాయిదా వేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    హైకోర్టులో వాదిస్తుండగా గుండెపోటుతో న్యాయవాది మృతి 

    కేసు వాదిస్తుండగా గుండెపోటుతో న్యాయవాది మృతి

    హైదరాబాద్: హైకోర్టు హాల్‌లో న్యాయవాదికి గుండెపోటు. 21వ కోర్టు హాల్‌లో కేసు వాదిస్తుండగా కుప్పకూలి పడిపోయిన న్యాయవాది వేణుగోపాలరావు. వెంటనే అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన తోటి న్యాయవాదులు. అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన… pic.twitter.com/k1RJwgqJhz

    — ChotaNews App (@ChotaNewsApp) February 18, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్

    తెలంగాణ

    Rythu bharosa: సీఎం ఆదేశాలతో.. 17 లక్షల మంది ఖాతాల్లో రైతుభరోసా జమ భారతదేశం
    Road Transport and Highways: తెలంగాణకు జాతీయ రోడ్డు రవాణా శాఖ 176.5 కోట్లు విడుదల భారతదేశం
    Telangana: తెలంగాణలో పీఈ సెట్‌, ఎడ్‌ సెట్‌ షెడ్యూల్‌ విడుదల.. మార్చి 12న పీఈ సెట్‌ నోటిఫికేషన్‌ను జారీ భారతదేశం
    Hyderabad: హైదరాబాద్‌-విజయవాడ రూ.99కే.. ఫ్లిక్స్‌ బస్సులో లాంచింగ్ ఆఫర్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025