NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు!
    మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు!

    AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    09:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల విలువైన మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

    ఈ కేసు 2019 నుండి 2024 మధ్యకాలంలో జరిగిన మద్యం సరఫరా, ఆర్డర్ ఫర్ సప్లై (OFS) ప్రక్రియలలో జరిగిన అవకతవకలపై ఆధారపడింది.

    రాజ్ కసిరెడ్డి

    మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐటీ సలహాదారు. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయనను 2025 ఏప్రిల్ 21న హైదరాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు

    Details

    ప్రధాన నిందితులు

    వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరక్టర్ గోవిందప్ప బాలాజీ* ఈ కేసులో నిందితులుగా చేర్చారు.

    మద్యం కుంభకోణం విధానం

    సాంకేతికంగా నియంత్రిత OFS సిస్టమ్‌ను నిలిపివేసి, మానవీయంగా ఆర్డర్లు జారీచేసే విధంగా మార్పులు చేశారు. ఇది ప్రత్యేకంగా ఎంపిక చేసిన సరఫరాదారులకు ఆర్డర్లు ఇవ్వడానికి ఉపయోగించారు.

    Details

    కిక్‌బ్యాక్‌లు 

    ప్రతి మద్యం కేస్‌పై రూ.150 నుండి రూ.600 వరకు కిక్‌బ్యాక్‌లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా నెలకు సుమారు రూ.60 కోట్ల వరకు అవినీతి ఆదాయం పొందినట్లు సమాచారం

    బ్రాండ్‌ల మార్పు

    అంతర్జాతీయ మద్యం బ్రాండ్‌లను తొలగించి, స్థానికంగా తయారు చేసిన బ్రాండ్‌లను ప్రోత్సహించారు. దీంతో ప్రముఖ బ్రాండ్‌ల మార్కెట్ షేర్ 53% నుండి 5%కి పడిపోయింది.

    మనీ లాండరింగ్ పద్ధతులు

    షెల్ కంపెనీలు : నకిలీ కంపెనీల ద్వారా డబ్బును రూటింగ్ చేసి, చివరికి లబ్ధిదారులకు చేరవేశారు

    హవాలా లావాదేవీలు : హవాలా మార్గాల్లో డబ్బును విదేశాలకు పంపించారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైసీపీ

    తాజా

    AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు! ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు ఆపరేషన్‌ సిందూర్‌
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ
    MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    APPSC: పెండింగ్‌లో ఉన్న 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం భారతదేశం
    PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌ భారతదేశం
    Chandrababu: నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ  చంద్రబాబు నాయుడు
    Rain Alert: తెలంగాణ, ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తెలంగాణ

    వైసీపీ

    Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ చంద్రబాబు నాయుడు
    Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి
    Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్  భారతదేశం
    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025