Page Loader
Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2024
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి భారీ ఊరట లభించింది. ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం సహా మరో రెండు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూన్ 26 నుంచి నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లికి బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. పాస్ పోర్టును అప్పగించాలంటూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Details

రెండు నెలల పాటు జైలులో ఉన్న పిన్నెల్లి

ఇక కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు రెండు నెలలు పాటు నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి, ఒకట్రెండుసార్లు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే జిల్లా కోర్టు వాటిని కొట్టిపారేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆయన ఆశ్రయించారు. హైకోర్టులో పిన్నెల్లి బెయిల్ పిటిషన్ మీద వాదనలు కొనసాగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. చివరికి పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.