English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రెండు కుక్కలు అరుచుకోవడంపై తీవ్ర వివాదం.. బ్యాంకు సెక్యూరిటీ కాల్పుల్లో ఇద్దరు మృతి
    తదుపరి వార్తా కథనం
    రెండు కుక్కలు అరుచుకోవడంపై తీవ్ర వివాదం.. బ్యాంకు సెక్యూరిటీ కాల్పుల్లో ఇద్దరు మృతి
    కాల్పులు జరిపిన బ్యాంకు సెక్యూరిటీ గార్డు

    రెండు కుక్కలు అరుచుకోవడంపై తీవ్ర వివాదం.. బ్యాంకు సెక్యూరిటీ కాల్పుల్లో ఇద్దరు మృతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 18, 2023
    11:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌‌లో ఈ మధ్యకాలంలో చాలా దారుణా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి . దీంతో ఏదో ఒక నేరానికి సంబంధించిన అంశంతో నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన జరిగింది.

    రెండు కుక్కల పరస్పరం అరుచుకున్న ఘటనలో యజమానులు గొడవ పడ్డారు. దీంతో ఓ కుక్క యజమాని హత్య జరగడం కలకలం సృష్టిస్తోంది.

    35 ఏళ్ల విమల్ అచల్ రాత్రి 11 గంటలకు తన పెంపుడు కుక్కను తీసుకుని వాకింగ్​కి బయల్దేరాడు.

    అదే సమయంలో రాజ్‌పాల్ రజావత్, పొరిగింటి వ్యక్తి అతని పెంపుడు కుక్కతో బయటకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురెదురు పడ్డ కుక్కలు పరస్పరం అరుచుకున్నాయి.

    DETAILS

    అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

    దీంతో ఇద్దరు యజమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గమనించిన స్థానికులు ఇద్దరిని శాంతింపజేసేందుకు కృషి చేశారు.

    ఈ క్రమంలోనే వివాదం ముదరడంతో, కోపోద్రిక్తుడైన రజావత్ తన ఇంటికి వెళ్లి తుపాకీతో బయటకి వచ్చాడు.

    ఈ క్రమంలోనే తనతో గొడవ పడిన వ్యక్తిపై తొలి అంతస్తు నుంచి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

    ఇండోర్ నగరంలోని కృష్ణబాగ్ కాలనీలో ఉంటున్న నిందితుడు రాజ్‌పాల్ రజావత్ స్థానికంగా బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు.

    వాగ్వాదంతో సర్వీస్​ తుపాకీతో ఘాతుకానికి పాల్పడ్డట్లు ఇండోర్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    హత్య

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    మధ్యప్రదేశ్

    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య ఇండోర్
    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  రైలు ప్రమాదం
    గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు  రాహుల్ గాంధీ

    హత్య

    సైకో ఘాతుకం; స్నాప్‌చాట్‌లో ప్రేమించిన మహిళ అనుకొని మరో యువతి హత్య ఆంధ్రప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు  ఉత్తర్‌ప్రదేశ్
    భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025