NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్‌‌లో ఘోరం..7 ఏళ్లు జెైలుకు వెళ్లినా బుద్ధిరాలేదు, ఈసారి దళిత బాలికపై రేప్
    తదుపరి వార్తా కథనం
    మధ్యప్రదేశ్‌‌లో ఘోరం..7 ఏళ్లు జెైలుకు వెళ్లినా బుద్ధిరాలేదు, ఈసారి దళిత బాలికపై రేప్
    మధ్యప్రదేశ్‌‌లో ఘోరం..7 ఏళ్లు జెైలుకు వెళ్లినా బుద్ధిరాలేదు, ఈసారి దళిత బాలికపై రేప్

    మధ్యప్రదేశ్‌‌లో ఘోరం..7 ఏళ్లు జెైలుకు వెళ్లినా బుద్ధిరాలేదు, ఈసారి దళిత బాలికపై రేప్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 17, 2023
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌‌లో దారుణం వెలుగు చూసింది. 7 ఏళ్ల పాటు జైల్లో శిక్ష అనుభవించిన ఇటీవలే విడుదలైన ఓ బుద్ధిలేని ఖైదీ మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ మేరకు ఐదేళ్ల దళిత బాలికను ఘోరంగా అత్యాచారం చేశాడు.

    రాకేష్ వర్మ అలియాస్ రక్కు 2012లో కోల్గ్వాన్ ఠాణా పరిధిలో నాలుగున్నరేళ్ల బాలికను రేప్ చేశాడు.

    దర్యాప్తులో రాకేష్ దోషిగా తేలడంతో న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మహేంద్ర సింగ్ చౌహాన్ వెల్లడించారు.

    సత్ప్రవర్తన కారణంగా నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షను రద్దు చేశారు.దీంతో 18 నెలల క్రితమే రక్కు(రాకేష్)ను జైలు నుంచి విడుదల చేశామన్నారు. జైలు నుంచి రిలీజైన సంవత్సరన్నరకు నిందితుడిలో దుర్మార్గుడు మళ్లీ నిద్రలేచాడు.

    DETAILS

    స్వీట్లు తినిపిస్తానని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డ రాకేశ్ వర్మ

    దీంతో మరో మైనర్ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పాపకు స్వీట్లు తినిపిస్తానని నమ్మబలికి, ప్రలోభాలకు గురిచేసినట్లు విచారణలో పోలీసులు తేల్చారు.

    బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో బాలిక కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే బాధితురాలి అమ్మమ్మ ఆమె కోసం గాలించింది.

    సుమారు రెండు గంటల పాటు గాలించాక ఇంటికి కొంత దూరంలో బాలిక ఆపస్మారక స్థితిలో రక్తసిక్తమై కనిపించింది. పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు గమనించిన కుటుంబీకులు, వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు.

    ప్రథమ చికిత్స అనంతరం రేవాలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలిక లైంగిక దాడికు గురైందని వైద్య నివేదికల్లో స్పష్టమైనట్లు పోలీసులు తెలిపారు. ఆటోలో పరారైన నిందితుడు రాకేష్ వర్మ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    మధ్యప్రదేశ్

    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి ఇండోర్
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య ఇండోర్
    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  రైలు ప్రమాదం
    గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025