NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్‌లో బాలికపై ఘోరం.. గ్యాంగ్ రేప్ తర్వాత సజీవ దహనం చేసిన దుండగులు
    తదుపరి వార్తా కథనం
    రాజస్థాన్‌లో బాలికపై ఘోరం.. గ్యాంగ్ రేప్ తర్వాత సజీవ దహనం చేసిన దుండగులు
    రాజస్థాన్‌లో బాలికపై ఘోరం.. సామూహిక అత్యాచారం తర్వాత సజీవ దహనం చేసిన దుండగులు

    రాజస్థాన్‌లో బాలికపై ఘోరం.. గ్యాంగ్ రేప్ తర్వాత సజీవ దహనం చేసిన దుండగులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 03, 2023
    02:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భిల్వారా జిల్లా పరిధిలోని కోత్రి గ్రామంలో రాత్రి 10 గంటలకు ఓ 14 ఏళ్ల మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు.

    అంతటితో ఆగకుండా బాలికను బొగ్గుల కొలిమిలో అగ్నికి ఆహుతి చేశారు.

    సమాచారం అందుకున్న ఏఎస్పీ కిషోరిలాల్, కోత్రి సీఐ శ్యాంసుందర్ 4 ఠాణాలోని పోలీసులు రాత్రే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

    ఈ మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    ఈ ఘటనపై రాష్ట్రంలో దుమారం రేగుతోంది. ఇప్పటికే ఈ ఘోరంపై స్థానికులు భగ్గుమంటున్నారు. అటు రాజకీయంగానూ ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా ఖండించింది.

    బుధవారం ఉదయం సదరు బాలిక పశువులను మేపాలని ఇంటి నుంచి పొలానికి వెళ్లిందని బాధిత బంధువులు వెల్లడించారు.

    details

    ఘటన స్థలిలో కిందపడి ఉన్న బాలిక వెండి కంకణాలు, బూట్లు 

    సాయంత్రం 4 గంటల సమయం దాటినా ఆమె ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే బాలిక కోసం గ్రామస్థులతో కలిసి కుటుంబ సభ్యులు గాలించారు.

    రాత్రి 10 గంటలకు గ్రామానికి బయట ఉన్న ఓ ఇటుకల బట్టిలో బొగ్గు కొలిమి కాలిపోతున్న విషయాన్ని గమనించారు. అనుమానంతో సమీపంలోకి వెళ్లి చూడగా బాలిక పొయ్యిలో కాలుతున్న దారుణ సంఘటన చూసి హతాశులయ్యారు.

    బాలిను తొలుత గ్యాంగ్ రేప్ చేసి అనంతరం బొగ్గు కొలిమిలో పడేసినట్లుగా గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలిలో బాలిక వెండి కంకణాలు, బూట్లు బొగ్గు కొలిమికి సమీపంలో కిందపడి ఉన్నాయి.

    ఉదయం నుంచి కొలిమి వద్ద భారీగా జనం గుమిగూడారు.ఫారెన్సిక్ బృందాన్ని పోలీసులు రప్పించగా ఆధారాలు సేకరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    అత్యాచారం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    అత్యాచారం

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం హర్యానా
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025