NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్
    తదుపరి వార్తా కథనం
    బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్
    బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్

    బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 02, 2023
    06:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళకరంగా మారింది. ఈ మేరకు కర్ణాటకలో ఘోరం జరిగింది.

    సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలను సాకుగా పెట్టుకుని ఓ ప్రభుద్ధుడు తన మాజీ ప్రియురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

    అక్కడితో ఆగకుండా ఆయా వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమె వద్దకు తన స్నేహితులను పంపి డబ్బులు దండుకుంటున్న దారుణ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. విద్యారణ్యపురకు చెందిన 28 ఏళ్ల జార్జ్ వృత్తి రీత్యా ఓ స్కూల్లో డాన్స్ మాస్టర్.

    ఫేస్ బుక్ ద్వారా ఇతనికి ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరూ తరచూ కలిసుకునేవారు. ఈ క్రమంలోనే జార్జ్ ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు అతన్ని దూరం పెట్టింది.

    DETAILS

    వేధింపులు భరించలేని యువతి ఏం చేసిందంటే?

    దీంతో తట్టుకోలేని జార్జ్, అప్పటివరకు తాము కలిసున్న వీడియోలు, ఫోటోలను అందరికీ చూపిస్తానని బెదిరించాడు.

    తనతో గడిపినట్టే తన స్నేహితులు సంతోష్, శశికుమార్ వద్ద సన్నిహితంగా ఉండాలని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు.

    గత్యంతరం లేని దుస్థితిలో ఉన్న ఆమె వద్దకు స్నేహితులను పంపించాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురి ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు వారిని కలవడం మానేసింది.

    ఈ నేపథ్యంలోనే వీడియోలు, ఫొటోలను జార్జ్ తన స్నేహితులకు పంపించాడు. జార్జ్ వేధింపులను ఇంక ఎంతమాత్రం భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

    దీంతో జార్జ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని ల్యాప్ టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు
    అత్యాచారం
    కర్ణాటక

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    బెంగళూరు

    క్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం విమానం
    గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ హైదరాబాద్
    గత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది ప్రకటన
    అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు కర్ణాటక

    అత్యాచారం

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం హర్యానా
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్

    కర్ణాటక

    నా నాయకత్వంలో కాంగ్రెస్‌కు 135 సీట్లు వచ్చాయి: డీకే శివకుమార్ సంచలన కామెంట్స్  కాంగ్రెస్
    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కాంగ్రెస్
    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  ముఖ్యమంత్రి
    కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025