NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్‌‌లో అమానుషం.. నిరసన తెలిపిన మహిళను జుట్టి పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    మధ్యప్రదేశ్‌‌లో అమానుషం.. నిరసన తెలిపిన మహిళను జుట్టి పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు
    నిరసన తెలిపిన మహిళను జుట్టి పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు

    మధ్యప్రదేశ్‌‌లో అమానుషం.. నిరసన తెలిపిన మహిళను జుట్టి పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 17, 2023
    04:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళా పోలీసులు అరాచకం సృష్టించారు. ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించి మరోసారి పోలీసులు కఠిన మనస్కులు అనిపించుకున్నారు.

    కట్నీ జిల్లా కౌరియాకు చెందిన చైనా బాయ్‌ కచి (40 సంవత్సరాలు) మహిళకు చెందిన స్థలంలో విద్యుత్‌ టవర్‌ ఏర్పాటుకు సర్కార్ నిర్ణయించింది.

    ఈ మేరకు అనుమతి లేకుండా తన స్థలంలో కరెంట్ పనులు చేస్తున్నారని మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే తనకు ఇందుకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.

    మహిళ గోడును ఏమాత్రం వినిపించుకోని అధికారులు క్రమేపీ HT లైన్ - టవర్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే బంధువులతో కలిసి విద్యుత్ టవర్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు.

    DETAILS

    అన్ని శాఖల అధికారులు కలిసి నా భూమిని ఆక్రమించుకుంటున్నారు : బాధితురాలు

    విద్యుత్ శాఖ అధికారుల సమాచారం మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అనంతరం బాధితురాలిని సముదాయించకుండా, ఏకపక్షంగా బలప్రయోగం చేశారు.

    ఖాకీ దుస్తులు ఉన్నాయి కదా అని ఆ మహిళ జుట్టు పట్టి అక్కడి నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ మేరకు స్థానికులు ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. అనంతరం సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.

    దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు,టవర్‌ నిర్మాణ పనులు అడ్డుకోవడం వల్లే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.చట్టప్రకారమే వ్యవహరించామని సీనియర్‌ ఉన్నతాధికారి మనోజ్‌ కేడియా చెప్పారు.

    మరోవైపు నష్టపరిహారం ఇవ్వకుండానే పనులు మొదలుపెట్టారని బాధితురాలు వాపోయారు. కాంట్రాక్టర్లతో కలిసిన విద్యుత్‌ అధికారులు, రెవెన్యూ చివరకు పోలీసులు కూడా తన భూమిని ఆక్రమించుకునేందుకే చూస్తున్నారన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    విద్యుత్
    మహిళ

    తాజా

    Motivational: అనుకున్నది సాధించాలంటే.. ముప్పయ్యేళ్ల లోపు మీకున్న ఈ చెడు అలవాట్లు వదిలేయండి ప్రేరణ
    WTC 2023-25 Team of the Tournament : విరాట్, రోహిత్ శర్మకు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో జైస్వాల్, బుమ్రా ఎంపిక  టీమిండియా
    Shreyas Iyer: ఫైనల్ మ్యాచ్‌ ఓడిపోవాల్సింది కాదు.. శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    IPL 2025 Final: నా కలను నిజం చేశారు.. ఆర్సీబీ విజయం‌పై విజయ్ మాల్యా హర్షం! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    మధ్యప్రదేశ్

    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి ఇండోర్
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య ఇండోర్
    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  రైలు ప్రమాదం
    గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    విద్యుత్

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం బొగ్గు శాఖ మంత్రి
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్

    మహిళ

    ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే సలహాలు, వాటి వెనక ఉండే నిజాలు ప్రెగ్నెన్సీ
    బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం బడ్జెట్ 2023
    ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు తమిళనాడు
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025