NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhya Pradesh : నమ్మించి కారు ఎక్కించుకున్నారు.. కదులుతున్న వాహనంలో అత్యాచారం చేశారు
    తదుపరి వార్తా కథనం
    Madhya Pradesh : నమ్మించి కారు ఎక్కించుకున్నారు.. కదులుతున్న వాహనంలో అత్యాచారం చేశారు
    నమ్మించి కారు ఎక్కించుకున్నారు.. కదులుతున్న వాహనంలో అత్యాచారం చేశారు

    Madhya Pradesh : నమ్మించి కారు ఎక్కించుకున్నారు.. కదులుతున్న వాహనంలో అత్యాచారం చేశారు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 23, 2023
    04:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అబలపై మరో దాష్టీకం జరిగింది. దిండోరి పట్టణంలో కదులుతున్న కారులో ఓ మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారం చేశారు.

    దీంతో రాష్ట్రంలో మరోసారి కలకలం రేగింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో అతివలు దారుణ అఘయిత్యాలకు గురవుతున్నారు.

    వారి మీద మానభంగాలు, హత్యలు, హత్యాచారాలు, దాడులు జరగడం దేశవ్యాప్తంగా ప్రకంపణలు రేపుతున్నాయి.

    తాజాగా దిండోరిలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి గురిచేశారు.

    కార్యక్రమానికి వెళ్తున్న బాలికను చూసిన, అదే గ్రామానికి చెందిన నలుగురు నిందితులు తమ కారును ఆపారు. ఆపై ఆమెకు లిఫ్ట్ ఇస్తామన్నారు.

    DETAILS

    కేసు నమోదు చేయని పోలీసులపై చర్యలు :  ఏఎస్పీ

    అనంతరం బాలికను నమ్మబలికి, తమ వాహనాన్ని అటవీ ప్రాంతానికి తరలించారు.ఈ నేపథ్యంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

    బాలిక అరుపులు, కేకలు బయటకు రాకుండా కారు లోపలున్న మ్యూజిక్ ఎక్కువ సౌండ్' పెట్టారు. ఆ తర్వాత ఆ బాలిక జరిగిన దారుణాన్ని కుటుంబీకులకు చెప్పుకుంది.

    దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అదే రోజు పోలీసులను ఆశ్రయించారు. కానీ అక్కడ ఫిర్యాదును స్వీకరించలేదు.

    నవంబర్ 18న డిండోరి జిల్లా కేంద్రానికి వెళ్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా నిందితులపై కేసు నమోదు చేశారు.

    అత్యాచార ఘటనపై పోక్సో,ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఏఎస్పీ మార్కం అన్నారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశామన్నారు.

    కేసు నమోదు చేయని స్థానిక ఠాణా పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    AI tutors: విద్యా రంగంలో విప్లవం.. భవిష్యత్తు బోధనలో ఏఐ ట్యూటర్లే ప్రధాన పాత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం ఆపరేషన్‌ సిందూర్‌
    AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్‌ అనుమతి ఆంధ్రప్రదేశ్
    Anaganaga:ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'అనగనగా'.. స్ట్రీమింగ్‌లో అరుదైన రికార్డు టాలీవుడ్

    మధ్యప్రదేశ్

    ఇండోర్ నగరంలో అరుదైన శస్త్ర చికిత్స.. మహిళ కడుపులో భారీ కణితి తొలగింపు  ఇండోర్
    మధ్యప్రదేశ్‌లో నేలరాలిన పులి పిల్ల.. బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఆడపులి మృతి  భారతదేశం
    మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు ప్రియాంక గాంధీ
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025