NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్‌: భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు
    తదుపరి వార్తా కథనం
    మధ్యప్రదేశ్‌: భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు
    మధ్యప్రదేశ్‌లోని భార్య, ఇద్దరు పిల్లల దారుణ హత్య

    మధ్యప్రదేశ్‌: భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు

    వ్రాసిన వారు Stalin
    Jan 23, 2023
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. పైగా వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ఈ దారుణం జరిగిన రెండు నెలల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.

    ముగ్గురిని హత్య చేసిన తర్వాత నిందితుడు ఏం జరగనట్టు అందరితో సాధారణంగా వ్యవహరించాడు. రెండు నెలలుగా అతను ఒక్కడే కనపడటం, మిగతా కుటుంబ సభ్యులు కనపడకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

    మధ్యప్రదేశ్

    కుటుంబ కలహాల కారణంగానే హత్యలు చేసినట్లు ఒప్పుకున్ననిందితులు

    భార్య, పిల్లలను ఎందుకు హత్య చేశాడో నిందితుడు సోనూ తల్వాడే చెప్పినట్లు రత్లామ్ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ తివారీ చెప్పారు. కుటుంబ కలహాల కారణంగానే భార్యతో పాటు ఏడేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కూతురిని గొడ్డలితో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు చెప్తామని ఆయన పేర్కొన్నారు.

    మృతదేహాలు నిందితుడి భార్య, ఇద్దరు పిల్లలవేనని నిర్ధారించుకోవడానికి డీఎన్‌ఏ పరీక్షల కోసం పంపినట్లు ఎస్పీ చెప్పారు. వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు.

    ఇదిలా ఉండగా, మృతదేహాలను ఇంట్లో పూడ్చి పెట్టడానికి నిందితుడు సోనూ తల్వాడేకు మరో వ్యక్తి సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని కూడా అరెస్టు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025