NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar:బక్సర్ సమీపంలో పట్టాలు తప్పిన మగద్ ఎక్స్‌ప్రెస్.. రెండుగా విడిపోయిన  న్యూఢిల్లీ - పాట్నా రైలు 
    తదుపరి వార్తా కథనం
    Bihar:బక్సర్ సమీపంలో పట్టాలు తప్పిన మగద్ ఎక్స్‌ప్రెస్.. రెండుగా విడిపోయిన  న్యూఢిల్లీ - పాట్నా రైలు 
    బక్సర్ సమీపంలో పట్టాలు తప్పిన మగద్ ఎక్స్‌ప్రెస్.

    Bihar:బక్సర్ సమీపంలో పట్టాలు తప్పిన మగద్ ఎక్స్‌ప్రెస్.. రెండుగా విడిపోయిన  న్యూఢిల్లీ - పాట్నా రైలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 08, 2024
    04:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్ లో, బక్సర్ సమీపంలో రైలు ప్రమాదం కలకలం సృష్టించింది. దిల్లీ నుంచి ఇస్లాంపూర్‌ వైపు ప్రయాణిస్తున్న మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు, ట్వినిగంజ్‌,రఘునాథ్‌పుర్‌ రైల్వే స్టేషన్ల మధ్య రెండు భాగాలుగా విడిపోయింది.

    ఈ సంఘటన కారణంగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం 11:08 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

    ఆ సమయంలో వెనుక నుంచి ఏ రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

    వివరాలు 

    సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేసిన  రెస్క్యూ, సాంకేతిక బృందాలు 

    ఈ ఘటనపై తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో మాట్లాడుతూ, ''దిల్లీ నుండి ఇస్లాంపూర్‌ వెళ్ళే మగధ్‌ ఎక్స్‌ప్రెస్ (20802) రైలు కోచ్‌ ఎస్‌ 6 , ఎస్‌ 7 బోగీల మధ్య కప్లింగ్‌ తెగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న రెస్క్యూ, సాంకేతిక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. మధ్యాహ్నం 2:25 గంటలకు రైలుకు మరమ్మతులు పూర్తి కావడంతో అది ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత మిగతా రైళ్లనూ అనుమతించాం. ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు మూడు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి అసలు కారణాల కోసం దర్యాప్తును ఆదేశించాం'' అని తెలిపారు.

    వివరాలు 

    పశ్చిమ బెంగాల్ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం 

    ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఘుతియారీ షరీఫ్ రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

    ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంపైన ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి, తద్వారా ఇతర స్టాళ్లకు వ్యాపించాయి.

    ఫ్లాట్‌ఫాంలో రైళ్ల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు భయంతో అరవడం ప్రారంభించారు.

    ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బిహార్

    Bihar: బిహార్ అసెంబ్లీ లో నేడు నితీష్ కుమార్ ప్రభుత్వానికి బలపరీక్ష  భారతదేశం
    Bihar: బిహార్‌ విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం  భారతదేశం
    Bihar: విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం.. ఎన్డీఏకు అనుకూలంగా 129 ఓట్లు  అసెంబ్లీ ఎన్నికలు
    Bihar: బీహార్‌లో ఏఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు.. నితీష్ కుమార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025