Bay Of Bengal: బంగాళాఖాతంలో 4.2 తీవ్రతతో భూకంపం
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు ఉదయం సుమారు 7:26 గంటల సమయంలో బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఏస్) వెల్లడించిన సమాచారం ప్రకారం,ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 4.2గా నమోదైనట్లు తెలిపారు. భూకంపం కేంద్రం బంగాళాఖాతంలోని సముద్ర గర్భంలో, భూమి ఉపరితలానికి దిగువగా సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రకంపన ప్రభావంతో తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో స్వల్ప కుదుపులు అనిపించాయని స్థానికులు తెలిపారు.
వివరాలు
ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం నివేదికలు లేవు
అయితే ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు నివేదికలు లేవు. భూకంప కేంద్రం సముద్రంలో ఉండటం, తీవ్రత కూడా తక్కువగానే ఉండటంతో సునామీకి ఎలాంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎన్సీఏస్ అధికారులు మాట్లాడుతూ, ఇటువంటి చిన్న స్థాయి భూకంపాలు ఆయా ప్రాంతాల్లో అప్పుడప్పుడు నమోదు అవుతుంటాయని పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాత తీరాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ప్రభుత్వ అధికారులు పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బంగాళాఖాతంలో 4.2 తీవ్రతతో భూకంపం
Earthquake of magnitude 4.2 hit Bay of Bengal at about 7:26 am: National Center for Seismology (@NCS_Earthquake) pic.twitter.com/sWm1wXkReX
— Press Trust of India (@PTI_News) December 2, 2025