NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mahua Moitra: బీజేపీ ఎంపీ,సుప్రీంకోర్టు న్యాయవాదిపై పరువు నష్టం దావా వేసిన మహువా మొయిత్రా 
    తదుపరి వార్తా కథనం
    Mahua Moitra: బీజేపీ ఎంపీ,సుప్రీంకోర్టు న్యాయవాదిపై పరువు నష్టం దావా వేసిన మహువా మొయిత్రా 
    Mahua Moitra: బీజేపీ ఎంపీ,సుప్రీంకోర్టు న్యాయవాదిపై పరువు నష్టం దావా వేసిన మహువా మొయిత్రా

    Mahua Moitra: బీజేపీ ఎంపీ,సుప్రీంకోర్టు న్యాయవాదిపై పరువు నష్టం దావా వేసిన మహువా మొయిత్రా 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 17, 2023
    07:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తృణమూల్ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మోయిత్రా బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే,న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌లకు లీగల్ నోటీసు పంపారు.

    లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు ఎంపీ లంచం తీసుకున్నారని నిషికాంత్ దూబే, దేహద్రాయ్ ఆరోపించారు.

    ఈ పిటిషన్ ఈరోజు జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీనిపై శుక్రవారం విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

    2005 నాటి 'క్యాష్ ఫర్ క్వెరీ' కుంభకోణానికి సంబంధించి పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి నగదు, బహుమతుల రూపంలో మొయిత్రా 'లంచం' తీసుకున్నారని ఆరోపిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన నిషికాంత్ దూబే, కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కూడా లేఖ రాశారు.

    Details 

    దూబే చేసిన ఆరోపణలను ఖండించిన హీరానందానీ గ్రూప్

    నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలను హీరానందానీ గ్రూప్ ఖండించింది. తమకు రాజకీయాలు చెయ్యాల్సిన అవసరం లేదని పేర్కొంది.

    నిషికాంత్ దూబే,జై అనంత్ దేహద్రాయ్ తనను వ్యక్తిగతంగా,రాజకీయంగా పగ తీర్చుకోవడానికి తన ప్రతిష్ట, సద్భావనపై దాడి చేశారని ఆమె ఆరోపించింది.

    'అభిప్రాయ భేదాల'పై గతంలో అనేక సందర్భాల్లో ఎంపీలు మహువా మోయిత్రా, నిషికాంత్ దూబే గొడవ పడ్డారని నోటీసులో పేర్కొన్నారు.

    లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖలో తనపై వచ్చిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని మహువా మోయిత్రా నిషికాంత్ దూబేని కోరారు. ఆమె దూబే,దేహద్రాయ్‌ల నుండి వ్రాతపూర్వక క్షమాపణ కూడా కోరింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బీజేపీ ఎంపీ,సుప్రీంకోర్టు న్యాయవాదిపై పరువు నష్టం దావా వేసిన మహువా మొయిత్రా 

    Trinamool Congress MP #MahuaMoitra sues BJP MP and lawyer Jai Anant Dehadrai for defamation

    - Accused of accepting bribes for asking questions in Lok Sabha
    - Case scheduled for hearing on Friday
    - Complaint referred to ethics committee of lower Househttps://t.co/XyYRnUhCoh

    — Swarajya (@SwarajyaMag) October 17, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లోక్‌సభ

    తాజా

    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్
    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్

    లోక్‌సభ

    రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి ఇండియా
    మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట.. జైలు శిక్షపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు  సుప్రీంకోర్టు
    బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం బీజేపీ
    రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ; నేడు పార్లమెంట్‌కు కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025