NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా లంచాల ఆరోపణల వెనుక ఉన్నది మాజీ సన్నిహితుడేనా?
    తదుపరి వార్తా కథనం
    టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా లంచాల ఆరోపణల వెనుక ఉన్నది మాజీ సన్నిహితుడేనా?
    మహువా మోయిత్రాపై ఎథిక్స్ ప్యానెల్‌కు బీజేపీ ఎంపీ ఫిర్యాదు

    టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా లంచాల ఆరోపణల వెనుక ఉన్నది మాజీ సన్నిహితుడేనా?

    వ్రాసిన వారు Stalin
    Oct 17, 2023
    05:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

    అయితే తనకు ఓ సుప్రీంకోర్టు న్యాయవాది ఇచ్చిన బలమైన సాక్ష్యాల వల్లే తాను ఈ ఆరోపణలు చేస్తున్నట్లు దూబే పేర్కొన్నారు.

    ఇంతకీ ఆ న్యాయవాది ఎవరు అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

    ఆ న్యాయవాది ఎవరో కాదని మహువా మొయిత్రా మాజీ ప్రియుడు జై అనంత్ దేహడ్రాయ్‌గా తెలిసింది.

    కొంతకాలం క్రితం ఇద్దరు విడిపోయినట్లు బయటకు వచ్చింది. లంచాల ఆరోపణ నేపథ్యంలో ఎంపీ మహువా పలువురికి లీగల్ నోటీసులు జారీ చేసారు. అందులో అదానీ గ్రూప్, బీజేపీ ఎంపీ దూబే, దేహడ్రాయ్‌తో మీడియా సంస్తలు ఉన్నాయి.

    ఎంపీ

    అనంత్ దేహడ్రాయ్‌పై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు 

    జై అనంత్ దేహడ్రాయ్ తన మాజీ భాగస్వామిగా లీగల్ నోటీసుల్లో మహువా మోయిత్రా పేర్కొన్నారు.

    అంతేకాదు, న్యాయవాదిపై తీవ్రమైన ఆరోపణలు చేసారు. తన వ్యక్తిగత ఆస్తులను కాజేసారని, కుక్క దొంగతనం చేసారని, అసభ్యకరమైన సందేశాలను పంపారని దేహడ్రాయ్‌పై తీవ్ర విమర్శలు చేసారు.

    ఈ వ్యవహారాల వల్ల తాను పోలీసులకు కూడా దేహడ్రాయ్‌పై ఫిర్యాదు చేసినట్లు మహువా తన నోటీసుల్లో వివరించారు.

    ఈ క్రమంలో తనపై పగ తీర్చుకునేందుకు బీజేపీ ఎంపీతో దేహడ్రాయ్‌పై చేతులు కలిపినట్లు ఆరోపించారు.

    తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులో డెహాడ్రాయ్‌ను టీఎంసీ ఎంపీ డిమాండ్ చేసింది.

    ఎంపీ

    విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి: దూబే

    పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మొయిత్రా ఒక వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారని దుబే ఆరోపించారు.

    ఈ ఆరోపణల్లో నిజానిజాలను తేల్చేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని బిర్లాను కోరారు.

    కేంద్ర అశ్విని వైష్ణవ్‌, సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌లకు ఈ విషయాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా, ఇందుకోసం దర్యాప్తు ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఎథిక్స్ కమిటీకి విన్నవించారు.

    మహువా మొయిత్రా- రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త హీరానందానీ గ్రూప్ సీఈఓ దర్శన్ హీరానందానీ మధ్య లంచాల లావాదేవీలు జరిగిట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు.

    ఇటీవల లోక్‌సభలో మహువా మొయిత్రా అడిగిన 61ప్రశ్నల్లో 50ప్రశ్నలు దర్శన్ హీరానందానీ వ్యాపార ప్రయోజనాలకు సంబంధించినవే ఉన్నాయని దూబే ఆరోపించారు.

    ఎంపీ

    సోషల్ మీడియాలో అదానీపై మహువా మొయిత్రా ఫైర్

    బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా కూడా మహువా మొయిత్రా ఖండించారు.

    ఈ ఆరోపణల వెనుక అదానీతో పాటు తన మాజీ ప్రియుడు ఉన్నట్లు ఆమె ఆరోపించారు. అయితే ఈ ట్వీట్‌లో తన ప్రేమికుడు ఎవరు మాత్రం మొయిత్రా చెప్పలేదు.

    అంతేకాదు, అదానీపై తీవ్రస్తాయిలో మండిపడ్డారు. నకిలీ డిగ్రీ ఉన్న ఎంపీతో, తాను తిరస్కరించబడిన ప్రేమికుడి సహాయంతో తనపై దాడి చేస్తున్నారా? అని అదానీని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

    బొగ్గు కుంభకోణంలో భారతీయుల నుంచి దోచుకున్న రూ.13,000 కోట్లను ఈడీ, సీబీఐ రికవరీ చేసే వరకు తాను మౌనంగా ఉండబోనని మొయిత్రా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లోక్‌సభ
    ఓం బిర్లా
    బీజేపీ
    తాజా వార్తలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    లోక్‌సభ

    Delhi services bill: లోక్‌సభలో 'దిల్లీ సర్వీసెస్ బిల్లు'ను ప్రవేశపెట్టిన అమిత్ షా  దిల్లీ ఆర్డినెన్స్
    అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు  ప్రతిపక్షాలు
    రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి ఇండియా
    మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట.. జైలు శిక్షపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు  సుప్రీంకోర్టు

    ఓం బిర్లా

    లోక్‌సభలో బీజేపీ ఎంపీ అసభ్యకర పదజాలం.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన స్పీకర్‌  బీజేపీ
    TMC ఎంపీ మహువా మొయిత్రాపై ఆరోపణలు.. ఎథిక్స్ కమిటీ పరిశీలనకు పంపించిన స్పీకర్ ఓంబిర్లా  లోక్‌సభ

    బీజేపీ

    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  జమిలి ఎన్నికలు
    Udhayanidhi: 'సనాతన ధర్మం' మలేరియా, డెంగ్యూ లాంటిది: ఉదయనిధి స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు  తమిళనాడు
    'భయపడి జన్ ఆశీర్వాద యాత్రకు నన్ను ఆహ్వానించలేదు'.. బీజేపీపై ఉమాభారతి కామెంట్  మధ్యప్రదేశ్
    దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్  ఎం.కె. స్టాలిన్

    తాజా వార్తలు

    గాజాపై ఇజ్రాయెల్ నిఘా ఉన్నప్పటికీ.. హమాస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి?  హమాస్
    పిండాన్ని గర్భంలోనే చంపేయని ఏ కోర్టు చెప్తుంది?: అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు సుప్రీంకోర్టు
    హమాస్ మాస్టర్‌మైండ్ మహ్మద్ దీఫ్ ఇజ్రాయెల్‌పై దాడిని ఎలా ప్లాన్ చేశాడో తెలుసా?  హమాస్
    Hamas Cryptocurrency: దిల్లీలో దొంగిలించిన క్రిప్టోకరెన్సీ.. హమాస్ లీడర్ల ఖాతాల్లోకి బదిలీ  క్రిప్టో కరెన్సీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025