NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP FiberNet: ఏపీ ఫైబర్‌ నెట్‌లో భారీ మార్పులు.. ముగ్గురు ఉన్నతాధికారుల తొలగింపు!
    తదుపరి వార్తా కథనం
    AP FiberNet: ఏపీ ఫైబర్‌ నెట్‌లో భారీ మార్పులు.. ముగ్గురు ఉన్నతాధికారుల తొలగింపు!
    ఏపీ ఫైబర్‌ నెట్‌లో భారీ మార్పులు.. ముగ్గురు ఉన్నతాధికారుల తొలగింపు!

    AP FiberNet: ఏపీ ఫైబర్‌ నెట్‌లో భారీ మార్పులు.. ముగ్గురు ఉన్నతాధికారుల తొలగింపు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 20, 2025
    01:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ఆ సంస్థ ఛైర్మన్‌ జీవీ రెడ్డి స్పష్టం చేశారు.

    ఫైబర్ నెట్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ పప్పూ భరద్వాజ, బిజినెస్ అండ్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ గంధంశెట్టి సురేశ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ శశాంక్‌ హైదర్‌ ఖాన్‌లను తొలగిస్తున్నట్టు తెలిపారు.

    ఈ మేరకు సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

    400 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశించినా, ఎండీ, ఈడీ చర్యలు తీసుకోలేదని జీవీ రెడ్డి పేర్కొన్నారు.

    ఫలితంగా ఉద్యోగులకు జీతాల రూపంలో సంస్థ నిధులు వెచ్చించాల్సి వచ్చిందని విమర్శించారు.

    Details

    సంస్థలో పురోగతి కనిపించడం లేదు

    జీఎస్టీ అధికారులు సంస్థపై రూ. 377 కోట్ల జరిమానా విధించినా ఎవరూ తన దృష్టికి తీసుకురాలేదని ఆరోపించారు. 8 నెలలుగా సంస్థలో పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

    రూపాయి కూడా ఆదాయం తీసుకురాలేక పోయామని, కొత్త కనెక్షన్లు ఏవీ ఇవ్వలేకపోయామని తెలిపారు. తమ నిర్ణయాలకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని అధికారులు సహకరించడం లేదని పేర్కొన్నారు.

    ఇక జీవీ రెడ్డి ఫైబర్ నెట్ ఎండీ దినేశ్‌కుమార్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

    ఆగస్టులో ఎండీగా వచ్చినప్పటి నుంచి ఒక్కరోజూ సమీక్ష నిర్వహించలేదని. ఆయన కనీసం ఓ ఆపరేటర్‌ను కూడా కలవలేదని ఆరోపించారు.

    గత ప్రభుత్వంలానే ఆయన పని చేస్తున్నారని, ఆదాయం పెంచే చర్యలు తీసుకోవడం లేదు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

    Details

    అక్రమ చెల్లింపులపై ఆరోపణలు 

    సిబ్బందికి అక్రమంగా మూడు నెలల జీతాలు చెల్లించారని జీవీ రెడ్డి తెలిపారు.

    ఈ మొత్తం జీతాల చెల్లింపును ఎండీ దినేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారుల నుండి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.

    ఈ విషయంలో అడ్వకేట్ జనరల్, సీఎస్‌కు లేఖ రాస్తానని తెలిపారు. 2019-24 మధ్య అక్రమాలపై విజిలెన్స్ విచారణకు అధికారులు సహకరించలేదని ఆయన ఆరోపించారు.

    ఏపీ ఫైబర్ నెట్‌లో మార్పులు తప్పవని, సంస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకువస్తామని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Manipur violence: మణిపూర్‌ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ! మణిపూర్
    Vatican City: ప్రపంచంలో విరాళాలతో నిలిచే ప్రపంచపు మినీ దేశం.. అది ఎక్కడుందో తెలుసా? ప్రపంచం
    Rinku Singh: వైభవంగా భారత క్రికెటర్‌ రింకు సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం రింకూ సింగ్
    Singireddy Narayana Reddy: పాటలలో పరవశించిన కవి.. తెలుగు గేయానికి తాళం చెక్కిన తాత్వికుడు 'సినారే'! టాలీవుడ్

    ఆంధ్రప్రదేశ్

    APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వాట్సాప్‌ టికెట్‌ బుకింగ్‌.. కొత్త మార్గదర్శకాలు జారీ ప్రభుత్వం
    CM Chandrababu Naidu : 2024 బడ్జెట్‌లో ఏపీకి భారీ కేటాయింపులు.. చంద్రబాబు ఏం చెప్పారంటే? చంద్రబాబు నాయుడు
    Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు భారత జట్టు
    Andhra Pradesh: H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025