NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మైనంపల్లికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. ఎల్లుండి హస్తం గూటికి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే
    తదుపరి వార్తా కథనం
    మైనంపల్లికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. ఎల్లుండి హస్తం గూటికి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే
    ఎల్లుండి హస్తం గూటికి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

    మైనంపల్లికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. ఎల్లుండి హస్తం గూటికి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 25, 2023
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాజకీయాల్లో మల్కాజిగిరి బీఆర్ఎస్s ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వేడి పుట్టించారు.

    ఈ మేరకు అధికార పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ క్రమంలోనే 27న హస్తం కండువా కప్పుకునేందుకు రంగం సిద్దమైంది.

    దిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో మైనంపల్లితో పాటు కుమారుడు రోహిత్‌, ముగ్గురు కార్పోరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

    కాంగ్రెస్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్ ఇవాళ మైనంపల్లి ఇంటికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి మర్యాదపూర్వకంగా ఆహ్వానించనున్నారు.

    మైనంపల్లికి మల్కాజిగిరి, రోహిత్ కు మెదక్ టిక్కెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. దీంతో హస్తం గూటికి చేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    details

     స్థానిక ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు గులాబీ పార్టీకి బైబై 

    త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు. దీంతో మెదక్ టిక్కెట్ తన కుమారుడికి దక్కలేదని, ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

    బీఆర్ఎస్ నుంచి తనతో పాటు తన కుమారుడు రోహిత్ కోసం టిక్కెట్ ఆశించాడు మైనంపల్లి. పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం మెదక్ సీటును, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికే కేటాయించారు. దీంతో తిరుగుబాటు జోరందుకుంది.

    ఈ నేపథ్యంలోనే మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి తీవ్రంగా మాట్లాడారు. తన కుమారుడికి సీటు రాకుండా హరీశ్ అడ్డుకున్నాడంటూ భగ్గుమన్నారు.

    కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న మైనంపల్లి తాజాగా స్థానిక ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు గులాబీ పార్టీకి బైబై చెప్పేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    తెలంగాణ

    తాజా

    SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్
    Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే! సన్ రైజర్స్ హైదరాబాద్
    Kakani Govardhan: క్వార్ట్జ్‌ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి
    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్

    కాంగ్రెస్

    అన్ని ఒక్కొక్కటిగా వెనక్కి.. రాహుల్‌కు అధికారిక నివాసంగా పాత బంగ్లానే..! రాహుల్ గాంధీ
    పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ రాజ్యసభ
    మణిపూర్ అంశంపై రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్  రాజ్యసభ
    కాంగ్రెస్ వ్యాఖ్యలపై దుమారం.. ప్రధానిని సభకు రప్పించింది మేం కాదు, అవిశ్వాస తీర్మాన శక్తి  బీజేపీ

    తెలంగాణ

    తెలంగాణ: రైతులకు బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో కూడా వర్షాలు లేనట్టే  వర్షాకాలం
    తెలంగాణ: పారా మెడికల్‌ కోర్సుల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ వర్తింపు అసెంబ్లీ ఎన్నికలు
    తెలంగాణ: అర్చకులకు గుడ్ న్యూస్.. జీతాలు, ఆలయ నిర్వహణ సాయంపెంపు  తాజా వార్తలు
    తెలంగాణలో కొత్తగా 20 కేజీబీవీలకు కేంద్రం పచ్చజెండా.. కొత్త విద్యాలయాల జాబితా ఇదే  కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025