Page Loader
Mamata Banerjee: బంగ్లాదేశీయుల తరలింపుపై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు!
బంగ్లాదేశీయుల తరలింపుపై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు!

Mamata Banerjee: బంగ్లాదేశీయుల తరలింపుపై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) తర్వాత భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల పౌరులపై దృష్టి సారించింది. వారిని గుర్తించి స్వదేశాలకు తరలించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాల్లో బంగ్లాదేశ్‌ పౌరులు వందల, వేల సంఖ్యలో ఉన్నట్టు తేలింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే బంగ్లాదేశీయులను స్వదేశానికి పంపడంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. భారతదేశం అనేది అన్ని మతాల ప్రజలు నివసించే లౌకిక దేశం. కానీ బీజేపీ మాత్రం భాషా ప్రాతిపదికన రాజకీయాలు చేస్తుంది.

Details

రాజస్థాన్‌ నుండి మరో కేసు వచ్చింది

బెంగాల్‌ నుండి వలస వచ్చిన కార్మికులను, వారి నైపుణ్యాల కారణంగా ఇతర రాష్ట్రాలు పని కోసం పిలిపిస్తాయి. కానీ వారు అక్కడ తమలోతాము బెంగాలీ మాట్లాడితే చాలు, వారిని బంగ్లాదేశీయులని ముద్రవేసి స్వదేశానికి పంపేస్తున్నారు. ఇలాంటి అనేక కేసులు మాకు వచ్చాయి. మేమే వారిని తిరిగి తెప్పించామని మమతా బెనర్జీ తెలిపారు. తాజాగా రాజస్థాన్‌ నుండి మరో కేసు వచ్చింది. అక్కడ 300-400 మందిని బంగ్లాదేశీయులని ముద్రవేశారు. ఇది దేశంలో ఏం జరుగుతోందో రుజువు చేస్తుంది. వారు బంగ్లాదేశీయులు కాదు, వారికి స్వంత గుర్తింపు ఉంది. వారు పశ్చిమ బెంగాల్‌ నివాసితులు. పశ్చిమ బెంగాల్‌ కూడా భారతదేశంలో ఒక రాష్ట్రం. ఈ పరిస్థితి తగదని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.