NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manda Krishna : బీజేపీకి బిగ్ బూస్ట్.. కమలాన్ని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులకు మందకృష్ణ మాదిగ లేఖ
    తదుపరి వార్తా కథనం
    Manda Krishna : బీజేపీకి బిగ్ బూస్ట్.. కమలాన్ని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులకు మందకృష్ణ మాదిగ లేఖ
    MandaKrishna : బీజేపీకి బిగ్ బూస్ట్.. కమలాన్ని గెలిపించాలని మందకృష్ణ మాదిగ లేఖ

    Manda Krishna : బీజేపీకి బిగ్ బూస్ట్.. కమలాన్ని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులకు మందకృష్ణ మాదిగ లేఖ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 20, 2023
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల బీజేపీకి వెయ్యి ఏనుగుల బలం లభించింది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

    భాజపా పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలకు, నాయకులకు, కార్యకర్తలకు లేఖ రాశారు.

    మాదిగ కులస్థులను కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని ఆవేదన వెలిబుచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో తమ సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన కాంగ్రెస్'ను మర్చిపోవద్దని లేఖలో పేర్కొన్నారు.

    భారతదేశాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్'ను దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, తమకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.

    details

    చెప్పుకునేందుకు కూడా మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదు :  మందకృష్ణ

    తమకి అనుకూలమైన కమిషన్ల నివేదికలను కాంగ్రెస్ సర్కార్లు విస్మరించాయన్నారు. వర్గీకరణ కోసం కాంగ్రెస్ ఏరోజు ముందడుగు వేయలేదన్నారు.

    కమిషన్ల నివేదికలు తమకు అనుకూలంగా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాలు, పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దతపై చొరవ తీసుకోలేదన్నారు.

    తెలంగాణలో గత దశాబ్దకాలంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్, వర్గీకరణ అంశాన్ని ఏనాడు లేవనెత్తకపోవడం, వర్గీకరణకావాలని కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయలేదన్నారు.

    మరోపక్క బీఆర్ఎస్ తమ సామాజికవర్గాన్ని మోసం చేశారన్న మందకృష్ణ, ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ఎన్నో కుట్రలు చేశారన్నారు.

    తెలంగాణ మంత్రివర్గంలో కనీసం చెప్పుకునేందుకు కూడా మాదిగలకు అవకాశం కల్పించలేదన్నారు.కేసీఆర్ మాదిగలను రాజకీయంగా అణచివేశారన్నారు.

    అందువల్ల వర్గీకరణకు సానుకూలం అని ప్రకటించిన బీజేపీకే తమ మద్దతని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    బీజేపీ

    బీఆర్ఎస్ సర్కారుపై అమిత్ షా చురకలు.. కేసీఆర్ కారు, ఒవైసీ స్టీరింగ్ అంటూ.. అమిత్ షా
    మధ్యప్రదేశ్‌ బీజేపీ ఐదో జాబితా విస్పోటనమే..25-30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టిక్కెట్ మధ్యప్రదేశ్
    శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌పై రామాయణం నటుడిని బరిలోకి దింపుతున్న కాంగ్రెస్ శివరాజ్ సింగ్ చౌహాన్
    టీఎంసీ మహువా మోయిత్రా పై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025