Manipur: మణిపూర్లో మెయిటీ విద్యార్థుల అపహరణ కేసులో ఇద్దరు అరెస్టు
మణిపూర్లో ఇద్దరు మైతీ కమ్యూనిటీ విద్యార్థులను అపహరించిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని 30 ఏళ్ల లుంఖోసేయ్ చోంగ్లోయ్, 28 ఏళ్ల సత్గోగిన్ హాంగ్సిన్గా గుర్తించారు. నిందితులిద్దరినీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా,నవంబర్ 17 వరకు పోలీసు కస్టడీకి తరలించారు. ఇద్దరు బాలురను ఉగ్రవాద సంస్థ హత్య చేసి ఉండవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో మెయిటీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు యువకులు కిడ్నాప్కు గురయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సెక్మాయి ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై వెళ్లిన వారు కనిపించకుండా పోయారు. తప్పిపోయిన విద్యార్థుల ఆచూకీ కోసం ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.