'Bharat Nyay Yatra': రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర'కు 'గ్రౌండ్ పర్మిషన్' నిరాకరించిన మణిపూర్ ప్రభుత్వం
ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హట్టా కాంగ్జేబుంగ్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ'భారత్ న్యాయ్ యాత్ర'కు గ్రౌండ్ పర్మిషన్'ను మణిపూర్ ప్రభుత్వం బుధవారం తిరస్కరించింది. జనవరి 14న ఇంఫాల్ నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె మేఘచంద్ర,పార్టీ నాయకుల బృందంతో కలిసి బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ యాత్రకు అనుమతి ఇవ్వలేమని ముఖ్యమంత్రి తమకు తెలియజేసినట్లు చెప్పారు. ఈ పరిణామం అనంతరం వేదికను తౌబాల్ జిల్లాలోని ఖోంగ్జోమ్లోని ప్రైవేట్ ప్రదేశానికి మార్చినట్లు చెప్పారు. 14రాష్ట్రాలు,85 జిల్లాల్లో సాగే ఈ యాత్రను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు. ర్యాలీలో పాదయాత్ర, బస్సుయాత్రలు ఉంటాయి.