Manipur: మణిపూర్లో పోలీస్ హెడ్క్వార్టర్స్పై సాయుధుల దాడి.. 3 బోర్డర్ ఫోర్స్ సిబ్బందికి గాయాలు
మణిపూర్లో జరిగిన మరో హింసాత్మక ఘటనలో, గత రాత్రి తౌబాల్ జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై సామూహికంగా దాడి చేయడంతో ముగ్గురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది గాయపడ్డారు. తౌబాల్కు 100 కిమీ కంటే తక్కువ దూరంలో ఉన్న మోరే సరిహద్దులో ఇద్దరు కమాండోలు మరణించిన కొన్ని గంటల తర్వాత సాయుధ మిలిటెంట్లు గత ఉదయం పోలీసు బృందంపై దాడి చేయడంతో ఈ హింస జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తౌబల్ ఖంగాబోక్ ప్రాంతంలోని 3వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కాంప్లెక్స్ను సాయుధులు మొదట లక్ష్యంగా చేసుకొని కొందరు కాల్పులు జరిపారని తెలిపారు. దీంతో ముగ్గురు బీఎస్ఎఫ్ సిబ్బందికి బుల్లెట్ల గాయాలయ్యాయని చెప్పారు. వారిని ఇంఫాల్లోని దవాఖానకు తరలించామని వెల్లడించారు.