NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా 
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా 
    మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా

    మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా 

    వ్రాసిన వారు Stalin
    Aug 09, 2023
    08:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

    మణిపూర్ హింసపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నా, విపక్షాలు పారిపోతున్నాయని ఆరోపించారు. మణిపూర్ హింసపై చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

    కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు చర్చ అక్కర్లేదని, కేవలం నిరసన మాత్రమే కావాలని దుయ్యబట్టారు.

    సభలో రచ్చ సృష్టించి తమను మౌనంగా ఉంచాలని కాంగ్రెస్ చూస్తోందని, కానీ తమ నోరును మూయించలేరని షా ధీమా వ్యక్తం చేశారు.

    తమకు దేశ ప్రజల మద్దతు ఉందని చెప్పారు.

    అమిత్ షా

    మణిపూర్‌ హింసను ఎవరూ అంగీకరించరు: అమిత్ షా

    మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనపై తాను వివరంగా మాట్లాడతానని అమిత్ షా అన్నారు.

    మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, అలాంటి ఘటనను ఎవరూ అంగీకరించరన్నారు. మణిపూర్‌లో జాతి ఘర్షణ ఘటన సిగ్గుచేటని విపక్ష నేతలు అంటున్నారని, కానీ ఆ హింసను రాజకీయం చేయడం అంతకన్నా సిగ్గుమాలి చర్యగా అమిషా అభివర్ణించారు.

    మణిపూర్ మోదీ పట్టించుకోవడం లేదనే ప్రతిపక్షాల వాదనను అమిత్ షా కొట్టిపారేశారు.

    మోదీ ఆదేశాల మేరకు తాను మూడు రోజులు మణిపూర్‌లో పర్యటించినట్లు చెప్పారు. మొత్తం 16 వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి, 36,000 మంది జవాన్లను పంపామన్నారు.

    చీఫ్‌ సెక్రటరీని మార్చామని, డీజీపీని కూడా మార్చినట్లు, సెక్యూరిటీ అడ్వైజర్‌లను కూడా పంపినట్లు పేర్కొన్నారు.

    మణిపూర్

    1993 నాటి అల్లర్లను ప్రస్తావించిన అమిత్ షా

    మణిపూర్‌లో విపరీతమైన హింస చోటుచేసుకుందన్న ప్రతిపక్షాల వాదనతో నేను ఏకీభవిస్తున్నాని అమిత్ షా చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాల కంటే, తామే ఎక్కువ బాధపడుతున్నట్లు షా అన్నారు.

    కాంగ్రెస్ పాలనలో ఇంతకంటే ఘోరమైన హంస చెలరేగినట్లు అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో 1993 నాటి అల్లర్లను అమిత్ షా ఉదహరించారు.

    1993లో నాగా-కుకీ ఘర్షణల్లో 700 మంది మరణించారని అప్పుడు పార్లమెంట్‌లో ప్రకటన చేసింది ప్రధాని, హోంమంత్రి కాదని, హోంశాఖ సహాయ మంత్రి చేశారన్నారు.

    మణిపూర్‌ హింసపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నించడంపై అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    అవిశ్వాస తీర్మానం
    లోక్‌సభ
    హోంశాఖ మంత్రి

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ

    అవిశ్వాస తీర్మానం

    లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం లోక్‌సభ
    No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు?  లోక్‌సభ
    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే దిల్లీ ఆర్డినెన్స్
    ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    లోక్‌సభ

    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాహుల్ గాంధీ
    ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    ఈ పార్లమెంట్ సమావేశాల్లో 3కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు రాజ్యసభ

    హోంశాఖ మంత్రి

    చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం ఆంధ్రప్రదేశ్
    దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025