NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manmohan Singh: 1991 సంస్కరణలు, కొత్త ఆర్థిక యుగం ఆర్కిటెక్ట్
    తదుపరి వార్తా కథనం
    Manmohan Singh: 1991 సంస్కరణలు, కొత్త ఆర్థిక యుగం ఆర్కిటెక్ట్
    1991 సంస్కరణలు, కొత్త ఆర్థిక యుగం ఆర్కిటెక్ట్

    Manmohan Singh: 1991 సంస్కరణలు, కొత్త ఆర్థిక యుగం ఆర్కిటెక్ట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 27, 2024
    08:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రెండేళ్ల క్రితం శ్రీలంకలో లీటర్‌ పాల ధర రూ.1,100, గ్యాస్‌ ధర రూ.2,657కి చేరిందని వార్తలు వచ్చాయి.

    కోవిడ్‌ కారణంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది.

    ఇటువంటి పరిస్థితి భారత్‌కూ వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ,30 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు,ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌లు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాయి.

    1991 సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన మైనారిటీ ప్రభుత్వం పీవీ నరసింహారావును ప్రధానిగా,మన్మోహన్‌ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించింది.

    అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. విదేశీ దిగుమతుల కోసం భారత దగ్గర ఉన్న మారకద్రవ్యం కేవలం ఒక బిలియన్‌ డాలర్లకే పరిమితమైంది.

    వివరాలు 

    పరపతి పెంపు

    ఈ నగదు రెండు వారాలకు మించి సరిపోదు. ఈ పరిస్థితిలో రావ్‌ - సింగ్‌ల జోడీ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి బరిలో దిగింది.

    వంద రోజుల వ్యవధిలోనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది.

    ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మన్మోహన్‌సింగ్‌ రూపాయి మారకం విలువను జూలై 1న 9.5 శాతం తగ్గించారు, తర్వాత రెండు రోజులకే మరో 12 శాతం తగ్గించారు.

    దీని వల్ల ఎన్నారైల పెట్టుబడులు తిరిగి దేశంలోకి వచ్చాయి, విదేశీ మారకద్రవ్యం లోటు తాత్కాలికంగా తగ్గింది.

    పరువు కాపాడటానికి వ్యూహం

    మారకద్రవ్య కొరతను తీర్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు తాకట్టు పెట్టి 600 మిలియన్‌ డాలర్లు అప్పుగా తెచ్చారు.

    వివరాలు 

    లైసెన్స్‌ రాజ్‌ అంతం

    1991 జూలై 25న మన్మోహన్‌సింగ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లైసెన్స్‌ రాజ్‌ను నిర్వీర్యం చేయడంతో పాటు, దిగుమతులపై పన్నులు తగ్గించారు.

    ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించి ప్రైవేట్‌ రంగానికి ప్రోత్సాహం అందించారు.ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరించారు, దీని ద్వారా బ్లాక్‌మనీపై అదుపు సాధించారు.

    ప్రైవేటు రంగానికి ఉత్సాహం

    ప్రైవేటు బ్యాంకులకు అనుమతి ఇచ్చి, కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు 51శాతం వరకు అవకాశం కల్పించారు.దీనివల్ల ప్రైవేటు రంగం పుంజుకుంది,యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించాయి.

    ఆర్థిక పునరుత్థానం

    1990లో డబుల్‌ డిజిట్‌లో ఉన్న కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ 1992 నాటికి 10కి దిగువకు వచ్చింది.ఆర్థిక సంస్కరణల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగి,ఈ రోజు భారత దేశ ఆర్థిక ప్రగతి అందరికి కనిపించే స్థాయికి చేరుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మన్మోహన్ సింగ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మన్మోహన్ సింగ్

    భారత్ సరైన పనే చేసింది: రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత కేంద్రం వైఖరికి మాజీ ప్రధాని మద్దతు   జీ20 సదస్సు
    Manmohasingh: మన్మోహన్ సింగ్ కు ముగిసిన రాజ్యసభ పదవీకాలం...హీరోగా మిగిలిపోయారన్న మల్లికార్జునఖర్గే మల్లికార్జున ఖర్గే
    Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Manohansingh On Modi: ప్రసంగాలతో ప్రధాని గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ: మన్మోహన్ సింగ్   నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025