తదుపరి వార్తా కథనం

Tamil Nadu: తమిళనాడులో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 04, 2025
11:10 am
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఒక భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు కారణంగా ఫ్యాక్టరీ సమీపంలోని ఆరు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.