NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు
    తదుపరి వార్తా కథనం
    Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు
    డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు

    Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 29, 2025
    02:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌ నగరంలో డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

    ఈ ఘటనపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు.

    బ్యాంకు మేనేజర్‌ సహా 52 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి వందల సంఖ్యలో చెక్‌బుక్‌లు, సెల్‌ఫోన్లు, రబ్బర్‌ స్టాంపులు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

    ఈ ముఠా మూడు విధాలుగా సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

    నిందితుల్లో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

    Details

    డిజిటల్

    ఫేస్‌ బుక్ బ్రౌజింగ్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అమాయక ప్రజలను ఆకర్షించి మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ట్రేడింగ్ పేరుతో ఓ బాధితుడి నుంచి రూ.93 లక్షలు కాజేశారని సీవీ ఆనంద్ తెలిపారు.

    మ్యూల్ ఖాతాలను ఉపయోగించి బ్యాంకు అధికారుల సహకారంతో నిందితులు భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

    గతేడాది మొత్తం రూ.3,500 కోట్లు సైబర్ క్రైమ్‌ ద్వారా నష్టపోయారని, ఇందులో కేవలం 13 శాతం మాత్రమే రికవరీ చేయగలిగామని తెలిపారు.

    నిందితులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు కావడంతో దర్యాప్తు ఆలస్యమవుతోందని పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సైబర్ నేరం
    హైదరాబాద్

    తాజా

    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్
    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి

    హైదరాబాద్

    Telangana : రాష్ట్రంలో తీవ్ర చలి, ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత తెలంగాణ
    Hyderabad: ORR పై యూట్యూబర్ మనీ హంటింగ్ వీడియో.. కేసు నమోదు చేసిన పోలీసులు  భారతదేశం
    Allu Aravind: అల్లు అర్జున్ తరఫున వచ్చా.. బాధితులను ఆదుకుంటాం: అల్లు అరవింద్  అల్లు అర్జున్
    Hyderabad Book Fair 2024: నేటి నుంచే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌.. ఫుల్ డీటెయిల్స్ ఇవే! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025