NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Meerut murder: భర్త సొమ్ముతో.. ప్రియుడి బెట్టింగ్ .. మేరఠ్‌ హత్య కేసులో కీలక విషయాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Meerut murder: భర్త సొమ్ముతో.. ప్రియుడి బెట్టింగ్ .. మేరఠ్‌ హత్య కేసులో కీలక విషయాలు
    భర్త సొమ్ముతో.. ప్రియుడి బెట్టింగ్ .. మేరఠ్‌ హత్య కేసులో కీలక విషయాలు

    Meerut murder: భర్త సొమ్ముతో.. ప్రియుడి బెట్టింగ్ .. మేరఠ్‌ హత్య కేసులో కీలక విషయాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 24, 2025
    10:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్యకేసు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

    తన ప్రియుడు సాహిల్‌ శుక్లాతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన ఘోరానికి ముస్కాన్‌ రస్తోగి ఒడిగట్టింది.

    ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టి పలు కీలక విషయాలను వెలుగులోకి తెస్తున్నారు.

    వివరాలు 

    భర్త సంపాదన ప్రియుడికి - బెట్టింగ్‌ మోజులో విహారయాత్రలు 

    సౌరభ్‌ విదేశాల్లో ఉండగా, తన భార్య ముస్కాన్‌ అవసరాల నిమిత్తం ప్రతినెలా లక్ష రూపాయలు పంపించేవాడు.

    అయితే, ఈ డబ్బులు భర్త కోసం కాకుండా, ముస్కాన్‌ తన ప్రియుడు సాహిల్‌కు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది.

    సాహిల్‌ ఆ సొమ్ముతో క్రికెట్‌ బెట్టింగ్‌లు ఆడేవాడు. గెలిచిన డబ్బుతో ముస్కాన్‌తో కలిసి రిషికేశ్‌, దెహ్రాదూన్‌ తదితర ప్రాంతాలకు ట్రిప్‌లకు వెళ్లేవాడు.

    సాహిల్‌కు ఉద్యోగం లేకపోయినా, గ్యాంబ్లింగ్ ద్వారా సంపాదించిన పైసలతోనే లైఫ్ ఎంజాయ్‌ చేసేవాడని పోలీసులు తెలిపారు.

    వివరాలు 

    హత్యకు ముస్కాన్‌ పక్కాగా ప్లాన్‌ 

    సౌరభ్‌ను హత్య చేసేందుకు ముస్కాన్ ముందుగానే ప్రణాళిక రూపొందించింది. మొదట అతనికి నిద్రమాత్రలు ఇవ్వాలని భావించి, మందుల చీటీని ఫోర్జరీ చేసింది.

    ఫిబ్రవరి 22న ఓ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి తాను ఆందోళన సమస్యతో బాధపడుతున్నానని చెప్పి మందులు రాయించుకుంది.

    ఆ తర్వాత ఖాళీ ప్రిస్క్రిప్షన్‌ పేపర్‌ను సంపాదించి, దానిలో నిద్రమాత్రల వివరాలను చేర్చింది.

    ఫిబ్రవరి 25న సౌరభ్‌ను హత్య చేయాలని ప్రణాళిక వేసింది. అయితే, ఆ రోజున అతను మద్యం సేవించకపోవడంతో ముస్కాన్‌ ప్రయత్నం విఫలమైంది.

    అనంతరం, మార్చి 4న మరోసారి ప్లాన్‌ చేసి, సౌరభ్‌కు నిద్రమాత్రలు ఇచ్చి, ప్రియుడు సాహిల్‌తో కలిసి అతడిని అత్యంత దారుణంగా హత్య చేసింది.

    వివరాలు 

    ప్రేమించి పెళ్లాడి.. తర్వాత ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన ముస్కాన్‌ 

    2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్‌(29), ముస్కాన్‌(27) దంపతులకు 2019లో కుమార్తె జన్మించింది.

    అయితే, కొంతకాలానికే ముస్కాన్‌ సాహిల్‌(25)తో వివాహేతర సంబంధం కొనసాగించింది.

    సౌరభ్‌ మర్చంట్‌ నేవీలో ఉద్యోగం వదిలేసి లండన్‌లో ఓ బేకరీలో పనిచేస్తుండేవాడు.

    అయితే, కుమార్తె పుట్టినరోజు కోసం గత నెల భారతదేశానికి వచ్చాడు. ఇదే అతని చివరి ప్రయాణంగా మారింది.

    ముస్కాన్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు.

    అనంతరం, ఆ శరీర భాగాలను ఓ ప్లాస్టిక్‌ డ్రమ్ములో దాచిపెట్టి, దానిపై సిమెంట్ పోసి కప్పేశారు.

    ఈ ఘోరం వెలుగు చూసిన తర్వాత, పోలీసులు ముస్కాన్‌ రస్తోగి, సాహిల్‌ శుక్లా లను అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Kannappa: 'కన్నప్ప' ఫైనల్ చాప్టర్.. కామిక్ బుక్ చివరి అధ్యాయం రిలీజ్ కన్నప్ప
    Trump pakistan deal : పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో అమెరికా ఒప్పందం.. ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు! అమెరికా
    Airtel Fraud Detection: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా 'ఫ్రాడ్‌ డిటెక్షన్‌' ఫీచర్‌ అందుబాటులోకి! ఎయిర్ టెల్
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    ఉత్తర్‌ప్రదేశ్

    Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి ఇండియా
    Uttar Pradesh: బాగ్‌పత్‌లో లడ్డూ వేదిక కూలడంతో ఐదుగురు మృతి.. 50మందికి పైగా గాయాలు యోగి ఆదిత్యనాథ్
    Kumbh Mela 2025: మహా కుంభంలో మౌని అమావాస్య వేళ..  భక్తులకు అడ్వైజరీ  జారీ చేసిన అధికారులు  భారతదేశం
    Kumbhamela: మహా కుంభమేళాలో అపశ్రుతి.. తొక్కిసలాట జరిగి 15 మంది మృతి! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025