NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం
    తదుపరి వార్తా కథనం
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం
    నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం

    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 17, 2025
    09:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల భారం తప్పలేదు.

    ఇటీవల టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన మెట్రో రైల్‌ సంస్థ, కొత్త ఛార్జీలను మే 17 నుంచి అమలులోకి తీసుకొచ్చింది.

    ఈ మేరకు నేటి నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. మెట్రో సంస్థ ప్రకారం, కనీస టికెట్ ధరను రూ.10 నుండి రూ.12కి, గరిష్ట టికెట్ ధరను రూ.60 నుండి రూ.75కి పెంచినట్లు తెలిపింది.

    2017లో హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి.

    అప్పటి నుంచి నిత్యం వేలాది మంది ఈ సేవలను వినియోగిస్తున్నారు.

    ప్రజల నుండి మంచి స్పందన వచ్చినా, ఇప్పటివరకు ఛార్జీలను పెంచలేదు. అయితే తొలిసారి టికెట్ ధరల పెంపు అనివార్యమైంది.

    Details

    కొత్త టికెట్ ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

    ఫేర్ ఫిక్సేషన్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఛార్జీలను సవరించినట్లు మెట్రోను నిర్వహిస్తున్న L\&T సంస్థ వెల్లడించింది. ఈ పెంపుతో టికెట్ ధరలు సగటున 20 శాతం మేర పెరిగినట్లు పేర్కొనవచ్చు.

    2 స్టాప్‌లు వరకు రూ.12 (కనీస ఛార్జీ)

    2 నుంచి 4 స్టాప్‌లు : రూ.18

    4 నుంచి 6 స్టాప్‌లు : రూ.30

    6 నుంచి 9 స్టాప్‌లు : రూ.40

    9 నుంచి 12 స్టాప్‌లు : రూ.50

    12 నుంచి 15 స్టాప్‌లు : రూ.55

    15 నుంచి 18 స్టాప్‌లు : రూ.60

    18 నుంచి 21 స్టాప్‌లు : రూ.66

    24 స్టాప్‌లు లేదా అంతకంటే ఎక్కువ : గరిష్టంగా రూ.75

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మెట్రో స్టేషన్
    హైదరాబాద్

    తాజా

    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం

    మెట్రో స్టేషన్

    దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి  కేరళ
    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!  కేరళ
    Hyderabad Metro: ఆ రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను నడుపుతున్న హైదరాబాద్ మెట్రో  హైదరాబాద్
    15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

    హైదరాబాద్

     MMTS: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం ఇండియా
    MLC Election: హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల  ఎన్నికల సంఘం
    Hyderabad: అగ్ని ప్రమాదాలు,వరద ముంపు నివారణపై.. జీహెచ్‌ఎంసీ, హైడ్రా ప్రత్యేక దృష్టి భారతదేశం
    Betting Gang : ఫేక్ కంపెనీల పేరిట బెట్టింగ్ ముఠా.. హైదరాబాద్‌లో భార్యభర్తల అరెస్టు క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025