MGNREGA to PBGRY: ఉపాధి హామీ పథకం పేరుమార్పు.. పనిదినాలు పెంపు: కేంద్రం నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కు కొత్త పేరు ఇచ్చే నిర్ణయం కేంద్రం శుక్రవారం తీసుకుంది. ఈ పథకం ఇప్పుడు పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా పిలవబడుతుంది. అలాగే, పథకం కింద అందించే పని రోజుల సంఖ్యను 100 నుంచి 125 రోజులకి పెంచారు. ఒక పనిదినానికి కనీస వేతనాన్ని రూ.240గా సవరించడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకాన్ని 2006 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా పనుల కార్యక్రమంగా గుర్తింపు పొందింది. అడిగినవారికి లేదనకుండా,ఉన్న ఊళ్లోనే శ్రామికులకు సంవత్సర కాలంలో కనీసం వంద రోజులపాటు పని కల్పించడం ద్వారా పల్లెపట్టుల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రయోజనకర ఆస్తుల పరికల్పనకు దాన్ని ఉద్దేశించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉపాధి హామీ పథకం పేరుమార్పు
BREAKING || MNREGA To Be Renamed
— TIMES NOW (@TimesNow) December 12, 2025
- The Centre has proposed renaming MNREGA to the Pujya Bapu Grameen Rozgar Guarantee Bill 2025@pragyakaushika shares more details with @HeenaGambhir. pic.twitter.com/qH1R5Nh1JK