NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణలో ఇండ్లులేని పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణలో ఇండ్లులేని పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్
    తెలంగాణలో ఇండ్లులేని పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్

    Telangana: తెలంగాణలో ఇండ్లులేని పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 10, 2025
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో ఇండ్లులేని పేదల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది.

    ఇండ్లులేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

    రెండు దశల్లో ఈ ఇళ్లు పంపిణీ చేయాలని భావించిన సర్కారు, మొదటి దశలో స్థలాలు ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపింది.

    రెండో దశలో ప్రభుత్వమే స్థలంతో పాటు ఇండ్లు నిర్మించి అందజేయాలని స్పష్టం చేసింది.

    ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన సర్వే దాదాపు 95% పూర్తయింది.

    ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

    వివరాలు 

    ఇందిరమ్మ ఇండ్ల ఎంపికపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ 

    ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    ఇందిరమ్మ ఇండ్ల ఎంపికపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ మాడ్యూల్‌ను ప్రారంభించామని మంత్రి తెలిపారు.

    ఈ వ్యవస్థ ద్వారా indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు.

    ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారని తెలిపారు.

    గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ల ద్వారా సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు వెళ్తుందని.. వాళ్లు వెంటనే ఆ ఫిర్యాదుపై దృష్టి సారిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు.

    ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన వారికి మాత్రమే ఇండ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

    వివరాలు 

    గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88% పరిశీలన పూర్తి 

    ఇప్పటికే 32 జిల్లాల్లో 95% దరఖాస్తుల పరిశీలన పూర్తవగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88% పరిశీలన పూర్తయినట్లు తెలిసింది.

    లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేసి, నిర్మాణ ప్రణాళికపై దృష్టి సారించాలని అధికారులను మంత్రి సూచించారు.

    మొదటి దశలో స్థలం కలిగి ఉన్న వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కార్మికులు వంటి వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

    రెండో దశలో ప్రభుత్వం స్వయంగా స్థలంతో పాటు ఇండ్లు నిర్మించి అందజేయడం జరుగుతుందని తెలిపారు.

    ఈ విధంగా, పేదవారికి ఇళ్ల కలను సాకారం చేసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంకల్పబద్ధంగా ముందుకు సాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

    తాజా

    YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?  విజయవాడ సెంట్రల్
    Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి! ఎలక్ట్రిక్ స్కూటర్

    పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    రాహుల్ గాంధీ టీమ్‌తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్‌లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా?  ఖమ్మం
    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం.. జూలై 2న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి ఖమ్మం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025