NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ministry of Home Affairs: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  
    తదుపరి వార్తా కథనం
    Ministry of Home Affairs: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  
    రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

    Ministry of Home Affairs: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    04:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్ననేపథ్యంలో,భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

    ఈపరిణామాలను దృష్టిలో ఉంచుకొని,1968లో అమలులోకి వచ్చిన పౌర రక్షణ చట్టం, సంబంధిత నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలలో పౌర రక్షణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

    ఈమేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు పంపింది.

    పౌర రక్షణ నిబంధనల ప్రకారం అత్యవసర సేకరణల కోసం అవసరమైన అధికారాలను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.

    1968 పౌర రక్షణ నియమాల్లోని సెక్షన్ 11 ఇతర అంశాలతో పాటు,శత్రు దాడులు జరిగే పరిస్థితుల్లో కీలకమైన సేవలను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన అధికారాలను కల్పిస్తుంది.

    వివరాలు 

    స్థానిక అధికారుల సహకారంతో ఈ చర్యలు చేపట్టాలి 

    ఈ చట్టాన్ని 1968, మే 24న భారత పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం ప్రధానంగా యుద్ధం, బాహ్య దాడులు, అంతర్గత కలహాలు, ఇతర రకాల శత్రు చర్యల సమయంలో పౌరుల్ని, ఆస్తులను, దేశ భూభాగాన్ని రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి రూపుదిద్దుకుంది.

    ఈ చట్టం ద్వారా చేపట్టాల్సిన చర్యలలో బ్లాకౌట్ అమలు, ప్రమాదకర పదార్థాల నిల్వ, వినియోగంపై నియంత్రణ, వైద్య సహాయం, ఆహార సరఫరా, ఇతర కీలక సేవల అమలు వంటి అంశాలు ఉన్నాయి.

    స్థానిక అధికారుల సహకారంతో ఈ చర్యలను చేపట్టాల్సిందిగా కేంద్రం పేర్కొంది.

    పౌర రక్షణ చర్యల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు పౌర రక్షణ కార్ప్స్‌ను ఏర్పాటు చేయవచ్చు.

    వివరాలు 

    శిక్షణ, అప్రమత్తత కోసం విన్యాసాలు (drills) నిర్వహిస్తారు

    ఈ కార్ప్స్‌కు ఒక కంట్రోలర్‌ను నియమించడం జరుగుతుంది. శత్రు దాడుల సమయంలో విద్యుత్ వెలుతురులను నియంత్రించడం, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు, జనాభాను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఖాళీ చేయించబడిన ప్రజలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించడం వంటి బాధ్యతలు ఈ కార్ప్స్‌కు ఉండేలా చట్టం ఏర్పాటు చేసింది.

    శిక్షణ, అప్రమత్తత కోసం విన్యాసాలు (drills) నిర్వహిస్తారు. అటువంటి విన్యాసాల సమయంలో వ్యక్తులకు లేదా ఆస్తికి నష్టం జరిగితే, ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది.

    పౌర రక్షణ నియమాలు కార్ప్స్ సభ్యుల నియామకం, శిక్షణ, విధులు తదితర అంశాలను నిర్దేశిస్తాయి.

    వివరాలు 

    రెండు వారాల ముందు నోటీసు ఇచ్చి రాజీనామా

    సాధారణంగా,సైనిక బలగాలు, పోలీసులు లేదా ఇతర ప్రత్యేక భద్రతా సేవలలో లేని పౌరులు ఈ సేవకు అర్హులు అవుతారు.

    సభ్యత్వానికి అభ్యర్థులు "Form A" ద్వారా దరఖాస్తు చేయాలి. సభ్యులుగా చేరే సమయంలో ప్రమాణం చేయాల్సి ఉంటుంది.

    విధి నిర్వహణలో గాయపడినట్లయితే లేదా ఆస్తి నష్టం జరిగినట్లయితే, సంబంధిత నిబంధనల ప్రకారం పరిహారం అందించబడుతుంది.

    అలాగే, సభ్యులు కనీసం రెండు వారాల ముందు నోటీసు ఇచ్చి రాజీనామా చేయవచ్చు.

    1960లలో బాహ్య దాడులు, అంతర్గత ఉద్రిక్తతల మధ్య ఈ చట్టం రూపుదిద్దుకుంది.

    1970లలో ఇది పౌరులను సమర్థవంతంగా సమీకరించి రక్షణ చర్యల అమలులో ముఖ్యపాత్ర పోషించింది.

    చట్టాన్ని ఉల్లంఘించినవారికి గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర హోంశాఖ

    తాజా

    Stock market: ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్‌ 880 పాయింట్లు పతనం! స్టాక్ మార్కెట్
    khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు పాకిస్థాన్
    Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు  ఆపరేషన్‌ సిందూర్‌
    Indo-Pak Tensions: ఆరోగ్య మౌలిక సదుపాయాలపై జేపీ నడ్డా సమీక్ష జేపీ నడ్డా

    కేంద్ర హోంశాఖ

    పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. తెలుగు రాష్ట్రాలలో ఎంతమందికంటే..? పోలీస్ మెడల్స్
    మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌పీ శ్రీనగర్‌ రాకేష్ బల్వాల్‌ నియామకం మణిపూర్
    French journalist: భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు.. ఫ్రెంచ్ జర్నలిస్టుకు కేంద్రం నోటీసులు ఫ్రాన్స్
    75th Republic Day: 1132 మంది సిబ్బందికి శౌర్య పతకాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025