LOADING...
 YCP MP Mithun Reddy : మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు
మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల

 YCP MP Mithun Reddy : మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2025
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరు సిట్ అధికారులు ఏ4గా చేర్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణ తర్వాత, కోర్టు ఆదేశాల ప్రకారం జులై 19న మిథున్ రెడ్డి సిట్ ఎదుర్కొని విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ అనంతరం అదేరోజు రాత్రి సిట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉండటం కారణంగా, ఆయన ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో మిథున్ రెడ్డి తన ఓటు హక్కు వాడుకోవాల్సిన అవసరం ఉన్నందున బెయిల్ కోరారు.

Details

సెప్టెంబర్ 11 సాయంత్రంలోగా సరెండర్ కావాలి

అయితే, సిట్ వాదన ప్రకారం, మధ్యంతర బెయిల్ కోరడానికి అర్హత లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికను సాకగా చూపిస్తూ బెయిల్ అడగడం సముచితం కాదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విచారించిన ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది . కోర్టు ఆదేశాల ప్రకారం, ఆయన సెప్టెంబర్ 11 సాయంత్రం ఐదు గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కావాలని షరతు విధించింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది.