NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్: విద్యార్థుల హత్య నేపథ్యంలో DC కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఆందోళనకారులు 
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్: విద్యార్థుల హత్య నేపథ్యంలో DC కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఆందోళనకారులు 
    మణిపూర్: విద్యార్థుల హత్య నేపథ్యంలో DC కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఆందోళనకారులు

    మణిపూర్: విద్యార్థుల హత్య నేపథ్యంలో DC కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఆందోళనకారులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 28, 2023
    01:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో ఇద్దరు మైతీ విద్యార్థులను కిడ్నాప్ చేసి హత్య చేశారన్న ఆరోపణలపై మంగళవారం చెలరేగిన హింస గురువారం కూడా కొనసాగింది.

    నివేదికల ప్రకారం, ఇంఫాల్ వెస్ట్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని గురువారం విద్యార్థుల నేతృత్వంలోని గుంపు వాహనాలకు నిప్పుపెట్టి, ధ్వంసం చేసింది.

    పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించడంతో బుధవారం రాత్రి కూడా భద్రతా సిబ్బంది, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

    విద్యార్థులు జూలైలో అదృశ్యమవ్వగా వారి మృతదేహాల ఫోటోలు ఇటీవల బయటపడ్డాయి. షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మెజారిటీ మెయిటీలు, గిరిజన కుకీల మధ్య జరుగుతున్న జాతి హింస మధ్య ఈ పరిణామం జరిగింది.

    Details 

    ఆరు నెలల పాటు రాష్ట్రాన్ని"డిస్టర్బడ్ ఏరియా"గా ప్రకటన 

    రాష్ట్ర జనాభాలో 53% ఉన్న మెయిటీలు-బంగ్లాదేశ్, మయన్మార్ నుండి అక్రమ వలసదారుల గురించి ఆందోళన చెందుతున్నారు.

    గిరిజనులు, కుకీలు,నాగాలు తమ పూర్వీకుల ప్రాంతాలను కోల్పోవడం గురించి ఆందోళన చెందుతున్నారు.

    ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, మణిపూర్ ప్రభుత్వం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) కింద వచ్చే ఆరు నెలల పాటు రాష్ట్రాన్ని మొత్తం "డిస్టర్బడ్ ఏరియా"గా బుధవారం ప్రకటించింది.

    ఈశాన్య రాష్ట్రంలోని సగోల్‌బాండ్, ఉరిపోక్, తేరా, యైస్కుల్ ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఆగ్రహించిన గుంపులు భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు.

    న్యూస్ అవుట్‌లెట్ ఇండియా టీవీ ప్రకారం, భద్రతా సిబ్బంది నివాస ప్రాంతాలలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ఆందోళనకారులు బండరాళ్లు, ఇనుప పైపులు, టైర్లను తగలబెట్టడం ద్వారా రోడ్లను అడ్డుకున్నారు.

    Details 

    డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి నిప్పు

    పెరుగుతున్న హింసకు ప్రతిస్పందనగా, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్)ని మోహరించారు.

    మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ది ప్రింట్‌తో మాట్లాడుతూ, "ప్రదర్శనలు,ర్యాలీలతో సహా వివిధ రకాల హింసాత్మక ఆందోళనలు జరుగుతున్నాయి" అని వర్గాలు వెల్లడించాయి.

    తౌబాల్‌లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యాలయానికి నిప్పు పెట్టడానికి ఆ గుంపు ప్రయత్నించింది.పెట్రోల్ బాంబులతో పోలీసు అవుట్‌పోస్టులపై దాడి చేసింది.

    ఇంఫాల్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించింది. రాళ్లు రువ్వింది, సిబ్బందిపై దాడి చేయడానికి కాటాపుల్ట్‌లను ఉపయోగించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

    మృతి చెందిన విద్యార్థులను 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్ మరియు 17 ఏళ్ల హిజామ్ లింతోఇంగంబిగా గుర్తించారు.

    Details 

    అటవీ ప్రాంతంలో భాదితుల మృతదేహాలు 

    ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించబడిన కొద్ది రోజుల తర్వాత వెలువడిన వైరల్ చిత్రంలో ఇద్దరు బాధితులు తుపాకీలు ఉన్న వ్యక్తులతో ఉన్నారు.

    మరో ఫోటోలో, హేమ్‌జిత్ తల తెగిపడిన వారి మృతదేహాలు అటవీ ప్రాంతంలో కనిపించాయి.

    ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం "డెసెసివ్ యాక్షన్ " అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది, అందులో ప్రజలు సంయమనం పాటించాలని కోరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్

    తాజా

    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్
    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్
    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్

    మణిపూర్

    మణిపూర్ వైరల్ వీడియో కేసులో కీలక మలుపు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ సీబీఐ
    Opposition in Manipur: మణిపూర్‌లో గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష కుటమి ఎంపీలు ప్రతిపక్షాలు
    Manipur viral video: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మణిపూర్ లైంగిక వేధింపుల బాధితులు; నేడు విచారణ సుప్రీంకోర్టు
    మణిపూర్ హింసకు 'కుకీ'లే కారణమని దాఖలైన పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025